పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండడంతో పెరుగుతున్న దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్:
► పక్షం రోజుల క్రితం... నగరంలోని రవాణాశాఖ కార్యాలయాల్లో తాత్కాలిక లెసైన్సుల కోసం వచ్చే వారి సంఖ్య సగటున రోజుకు 600.
► సోమవారం తాత్కాలిక లెసైన్సు కోసం 2300 మంది కార్యాలయాలకు వచ్చారు. ఈనెల 1వ తేదీ నుంచి ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ రోజుకు సగటున రెండు వేల మందికి చేరుకుంది.
► తాత్కాలిక లెసైన్సుల కోసం వాహనదారులు ఎగబడుతున్నారు. ఒక్కసారిగా ఇంత రద్దీ ఎందుకు పెరిగిందో తెలుసా..!!
లెసైన్సు లేకుండా వాహనాలు నడుపుతున్నవారిపై ట్రాఫిక్ పోలీసులు విరుచుకుపడటమే దీనికి కారణం. లెసైన్సు లేకుంటే జరిమానాతో సరిపెడుతూ వచ్చిన ట్రాఫిక్ పోలీసులు ఏకంగా వాహనాన్ని సీజ్ చేయటంతోపాటు వాహనదారుకు ఒకరోజు జైలు శిక్ష విధిస్తుండటంతో లెసైన్సులేని వారిలో కలవరం మొదలైంది. హైదరాబాద్లో దాదాపు 46 లక్షల వాహనాలుంటే లెసైన్సుల సంఖ్య 34 లక్షలున్నట్టు రవాణాశాఖ అధికారులు గుర్తించారు. అంటే మరో 12 లక్షల మంది లెసైన్సు లేకుండా వాహనాలు నడుపుతున్నట్టు స్పష్టమైంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు లెసైన్సు లేనివారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.
మార్చి ఒకటి నుంచి మోటారు వాహనాల చట్టంలోని అంశాలను కఠినంగా అమలు చేయనున్నట్టు కొంతకాలంగా ట్రాఫిక్ పోలీసులు ప్రచారం చేస్తూ వస్తున్నారు. లెసైన్సు, వాహనాలకు సంబంధించిన పత్రాలు, వాహన రిజిస్ట్రేషన్, హెల్మెట్ లేకుండా వాహనం నడపటం, సిగ్నల్ జంపింగ్, ఫోన్లో మాట్లాడుతూ వాహనాలను నడపటం... తదితర అంశాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ముమ్మరంగా ప్రచారం చేశారు. చెప్పినట్టుగానే మార్చి ఒకటి నుంచి కొరడా ఝళిపించటం మొదలుపెట్టారు.
ముఖ్యంగా లెసైన్సు లేకుండా వాహనాలు నడుపుతున్నవారిపై దృష్టి సారించారు. తొలిసారి పట్టుబడితే జరిమానాతో వదిలేస్తున్న పోలీసులు తదుపరి పట్టుబడిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే నగరంలో దాదాపు వంద వాహనాలను సీజ్ చేసి వాహనదారులపై కేసులు నమోదు చేశారు. వారికి ఒకరోజు జైలు శిక్ష విధిస్తుండటంతో మిగతావారిలో భయం పట్టుకుంది. దీంతో తాత్కాలిక లెసైన్సు కోసం రవాణాశాఖ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. గతంతో పోలిస్తే వీరి సంఖ్య మూడు రెట్లు పెరిగిందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
వాహనదారుల్లో లైసెన్స్ భయం
Published Wed, Mar 16 2016 12:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement