4 ప్రాంతాల్లో మల్టీప్లెక్స్ల నిర్మాణం
అనుమతి కోసం హెచ్ఎంఆర్ దర ఖాస్తు
జీహెచ్ఎంసీకి భారీగా ఆదాయం
సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్) ప్రాజెక్ట్లో భాగంగా నగరంలోని నాలుగు కీలక ప్రాంతాల్లో వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు రంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రద్దీ ఎక్కువగా ఉండే, ఎంపిక చేసిన నాలుగు ప్రాంతాల్లో భారీ షాపింగ్మాల్స్, మల్టీప్లెక్స్లు నిర్మించనున్నారు. ఎర్రమంజిల్, పంజగుట్ట, గడ్డిఅన్నారం, మాదాపూర్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ కాంప్లెక్స్ల నిర్మాణానికి అనుమతి కోరుతూ జీహెచ్ఎంసీకి హెచ్ఎంఆర్ దరఖాస్తు చేసింది. వాటిలో ఒకదానికి ఇప్పటికే అనుమతి లభించింది. మరో రెండింటికి అతి త్వరలో మంజూరు కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇంకొకటి పరిశీలన దశలో ఉంది. పూర్తి స్థాయి పరిశీలన అనంతరం దానికి అనుమతి ఇవ్వనున్నారు. జీహెచ్ఎంసీ ఖజానాకు వీటి ఫీజుల రూపంలో దాదాపు రూ.50 కోట్లు సమకూరనుందని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం లక్ష్యం రూ.500 కోట్లు కాగా... ఇప్పటి వరకు దాదాపు రూ.390 కోట్లు వచ్చినట్లు తెలిసింది.
రైలుతో పాటే ప్రారంభం?
మెట్రో రైలు ప్రయాణికులకు రవాణా సదుపాయం మాత్రమే కాక... వివిధ మార్గాల్లో వ్యాపారాల నిర్వహణకు హెచ్ఎంఆర్ నిర్ణయించడం తెలిసిందే. అందులో భాగంగా రద్దీ ప్రాంతాల్లో నాలుగు కాంప్లెక్స్ల నిర్మాణానికి గత ఏడాది దరఖాస్తు చేసుకుంది. బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులిచ్చే ఎంఎస్బీ కమిటీ సమావేశాల్లో ఇటీవలే పరిశీలన పూర్తయింది. దీంతో త్వరలోనే అనుమతులు జారీ కానున్నట్లు తెలుస్తోంది. మెట్రో ప్రాజెక్ట్ ఆలస్యమవుతుండడంతో రైలు పట్టాల పైకి వచ్చే నాటికి ఈ కాంప్లెక్స్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
కాంప్లెక్స్ల నిర్మాణం తీరిదీ...
ఖైరతాబాద్ ఎర్రమంజిల్ వద్ద షాపింగ్మాల్ కమ్ మల్టీప్లెక్స్ను నిర్మించనున్నారు. స్టిల్ట్ ప్లస్ ఆరు అంతస్తులతో నిర్మించనున్న ఈ కాంప్లెక్స్లో రెండు బేస్మెంట్లు ఉంటాయి. పంజగుట్ట వద్ద షాపింగ్ మాల్ కమ్ మల్టీప్లెక్స్ను రెండు బ్లాకులుగా నిర్మించనున్నారు. వీటిల్లో ఒక బ్లాకులో జీ ప్లస్ ఐదంతస్తులు, మరో బ్లాకులో జీ ప్లస్ ఆరంతస్తులు నిర్మించనున్నారు. మూడు బేస్మెంట్లను పార్కింగ్కు వినియోగిస్తారు. దీనికి ప్రాథమిక అనుమతి లభించడమే కాక ఇప్పటికే పనులు ప్రారంభమైనట్లు తెలిసింది. సైదాబాద్ గడ్డిఅన్నారం వద్ద షాపింగ్మాల్ కమ్ మల్టీప్లెక్స్ను జీ ప్లస్ రెండంతస్తులతో నిర్మించనున్నారు. మూడు బేస్మెంట్లతో నిర్మాణం జరుగనున్న ఈ కాంప్లెక్స్కు సంబంధించిన దరఖాస్తు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.మాదాపూర్లో జీ ప్లస్ ఐదంతస్తులతో భారీ వాణిజ్య సముదాయాన్ని నిర్మించనున్నారు. ఇందులో ఒక మెజానైన్ ఫ్లోర్ ఉంటుంది. సినిమా ప్రొజెక్టర్ల కోసం దీనిని నిర్మించనున్నట్లు సమాచారం.
మెట్రో మాల్స్
Published Wed, Mar 4 2015 12:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement