ఆరిమిల్లి అరాచకం
నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం
ద్వారకాతిరుమల: శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి న్యూఢిల్లీకి చెందిన పి.నాగ రఘురాం దంపతులు రూ.1,00,000 విరాళంగా అందజేశారు. స్వామిని దర్శించుకున్నారు. మట్టి మాఫియా.. రియల్ ఎస్టేట్ దందాలు.. బినామీ పేర్లతో కాంట్రాక్ట్లు.. వ్యాపారులపై బెదిరింపులు.. ఇవీ గత టీడీపీ పాలనలో తణుకులో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సాగించిన అరాచకాలు. నియోజకవర్గంలో ఏ పనులు జరగాలన్నా ఆయన కనుసన్నల్లోనే.. ఆయన బినామీ కాంట్రాక్టర్లే టెండర్లు దక్కించుకోవాలి.. పొరపాటున ఎవరైనా టెండర్ దాఖలు చేస్తే అంతే సంగతులు. నీరు–చెట్టు మొదలు మరుగుదొడ్ల నిర్మాణం వరకూ అవినీతికి లెక్కేలేదు. –సాక్షి ప్రతినిధి, ఏలూరు శనివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2024తణుకులో 2014–19 కాలంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నింటిలో నంబర్వన్ అని, రాష్ట్రంలోనే నంబర్వన్ ఎమ్మెల్యే అంటూ చంద్రబాబు కితాబు ఇచ్చారు. బహుశా అవినీతిని ప్రామాణికంగా తీసుకుని నంబర్వన్ స్థానం ఇచ్చి ఉంటారని నియోజకవర్గంలో ప్రజలు వ్యంగ్యంగా అంటున్నారు. అప్పట్లో ఐదేళ్ల పాలనలో ల్యాండ్మార్క్ అభివృద్ధి అనేది లేకపోగా పెద్ద ఎత్తున పనులకు అనుమతులు తేవడం, ఏ ఒక్కటీ పూర్తి చేయకుండా భారీగా దండుకోవడమే ఆయన అజెండాగా సాగింది. సొంత సామాజికవర్గం వారికి ప్రాధాన్యమిస్తూ మిగిలిన వర్గాలను దూరంగా ఉంచారనే ఆరోపణలు ఉన్నాయి. పేదల భూములు ప్రైవేటుపరం చేసిన చరిత్ర ఉంది. అలాగే ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి పనులు ఏమీ లేకపోవడంతో విమర్శలు, దూషణలు, నిందలకు ప్రాధాన్యమిస్తూ ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. మళ్లీ అధికారం వస్తే సరికొత్త దోపిడీకి మార్గనిర్దేశం చేసేలా కేడర్కు దిశానిర్దేశం చేస్తుండటం విశేషం.
వందల ఎకరాల్లో ‘రియల్’ దందా
ఆరిమిల్లి రాధాకృష్ణ సొంత గ్రామం వేల్పూరు కేంద్రంగా వందల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ దందా పతాక స్థాయిలో సాగింది. రిజర్వు సైట్లు లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా రోడ్ల నిర్మాణం, మాస్టర్ ప్లాన్ గోల్మాల్ చేసి బాలాజీనగర్, విష్ణుప్రియనగర్, కామధేనునగర్లో సుమారు 500 ఎకరాల్లో వెంచర్లు ఏర్పాటుచేశారు. 30, 40 ఎకరాల మేర రిజర్వు సైట్ లేకుండా చేసి రూ.80 కోట్ల వరకు సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కావలిపురంలోని ప్రస్తుత జగనన్న కాలనీ లేఅవుట్ (11 ఎకరాల విస్తీర్ణం)ను గతంలో పేదల ఇళ్ల పట్టాల కోసం దివంగత వైఎస్సార్ హయాంలో మంజూరు చేస్తే దానిలో లెవిలింగ్ పనులకు ఆరిమిల్లి అనుమతులు తెప్పించి రెండు బిల్లులు పెట్టడంతో ఈ విషయం వివాదాస్పదమై ఆర్డీఓ విచారణతో నిలిచిపోయింది.
వక్ఫ్ బోర్డు భూములపైనా.. ఇరగవరంలో సుమారు 40 ఎకరాల వక్ఫ్ బోర్డు భూములపైనా ఆరిమిల్లి ముఠా కన్ను పడింది. ముత్తావలీలు పూర్వంలో రైతులకు అమ్మేసిన భూమిని వక్ఫ్ బోర్డు ద్వారా స్వాధీనం చేసుకుని మట్టి దందాకు ప్లాన్ చేశారు. నిరసనలు, ఆందోళనలతో కోర్టుకెక్కడంతో ఈ వ్యవహారం పెండింగ్లో పడింది.
అక్రమాలు అనేకం
అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనంలో ఫిల్టర్ తవ్వకాల కోసం తీసిన మట్టిని అమ్ముకోవడం, ప్రాంగణాన్ని పూడ్చడానికి రూ.20 లక్షలకు బిల్లులు పెట్టి దండుకోవడం, నీరు–చెట్టులో దోపిడీ, ఉపాధి హామీ పథకంలో భాగంగా 77 కిలోమీటర్ల మేర రోడ్డుకిరువైపులా నాటిన ట్రీగార్డుల్లో లక్షల స్వాహా జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆరవల్లి గ్రామంలో పనులకు 20 శాతం కమీషన్ దండుకున్నారని, వేల్పూరులో మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. అత్తిలి నుంచి గుమ్మంపాడు వరకు రూ.1.40 కోట్లతో 2.20 కిలోమీటర్ల మేర నిర్మించిన రోడ్డు ఆరు నెలలకే కోతకు గురైందంటే కమీషన్లు ఏ స్థాయిలో అందాయో అర్థం చేసుకోవచ్చు.
పేదల భూమి కంపెనీ పరం
ఆంధ్రా షుగర్స్ సమీపంలో 7.26 ఎకరాల కాల్వ మళ్లింపు భూమి ఉండగా దివంగత సీఎం వైఎస్సార్ పేదలకు ఇళ్ల పట్టాలు అందించాలని సంకల్పించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రతిపాదనలు కూడా పంపారు. దీనిపై సదరు కంపెనీ కోర్టును ఆశ్రయించింది. తదనంతరం టీడీపీ అధికారంలోకి రాగానే ఈ భూమిని ఆంధ్రా షుగర్స్కు ఆరిమిల్లి భారీ వ్యవహారాలతో కట్టబెట్టారు. కౌన్సిల్ తీర్మానం చేసి భవిష్యత్లో ఇబ్బంది లేకుండా చేశారు. దీని విలువ సుమారు రూ.80 కోట్లకు పైనే ఉంటుంది. 400 మందికిపైగా దక్కాల్సిన భూమిని ఇలా కంపెనీకి ఆరిమిల్లి కట్టబెట్టారు. వైఎస్సార్సీపీలో చేరికలు
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైఎస్సార్సీపీలోకి వలసలు జోరందుకున్నాయి. ఇతర పార్టీల నేతలు భారీగా వచ్చి చేరుతున్నారు. VIIIలో uపోలీసులు, మహిళలంటే చులకన
పోలీసులు, మహిళలు అంటే ఆయనకు చులకన. కె.ఇల్లిందలపర్రులో ఇళ్ల స్థలాల సమస్య పై మహిళలు నిలదీయగా.. ఆయన ఆగ్రహానికి గురై మహిళలను ఛాతీభాగంపై చేతులు వేసి తోసుకుంటూ ముందుకువెళ్లారు. దీనిపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమైంది. ఇరగవ రం మండలంలో ఓ ఘర్షణ వివాదంలో టీడీ పీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారనే కోపంతో ఎస్సై, స్టేషన్ రైటర్ను తన క్యాంపు కార్యా లయానికి పిలిపించి తీవ్రస్థాయిలో దూషించడంతో పాటు వారిని అవమానించేలా నేలపై బలవంతంగా కూర్చోబెట్టారు. ఈ ఘటన రా ష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీస్ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చే యడంతో ఆయనపై కేసు కూడా నమోదైంది. న్యూస్రీల్తణుకు.. తల్లడిల్లి..
ఐదేళ్ల పాలనలో విధ్వంసకాండ
బినామీ కాంట్రాక్టర్ల పేరుతో దోపిడీ
మట్టి మఫియాకు ఆయనే డాన్
రియల్ వెంచర్లలో భారీ అక్రమాలు
మహిళలు, పోలీసులంటే చులకన
ఆరిమిల్లి హయాంలో అభివృద్ధి శూన్యం
ధాన్యంలో రూ.14 కోట్ల స్కామ్
ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో టీడీపీ నేతలు ఆరిమిల్లి నేతృత్వంలో భారీ అవినీతికి పాల్పడ్డారు. ఇరగవరం మండలం కత్తవపాడులో జన్మభూమి కమిటీల లిస్టులో డ్వాక్రా మహిళల పేరుతో ధాన్యం కొనుగోలు చేసినట్టు బ్యాంకు ఖాతాలు సృష్టించి వారికి తెలియకుండా సొమ్ము చేసుకున్నారు. సుమారు రూ.14 కోట్ల మేర అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. డ్వాక్రా మహిళల ఆందోళనతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
మట్టి మాఫియాకు డాన్
ఇరిగేషన్ పనులను అడ్డం పెట్టుకుని టీడీపీ మట్టిమాఫియా చెలరేగిపోయింది. డెల్టా ఆధునికీకరణ పనుల్లో భాగంగా గోస్తనీ, అత్తిలి కాల్వ, దువ్వ చానెల్కు మరమ్మతుల పేరుతో భారీగా దండుకున్నారు. దువ్వ–వయ్యేరు గట్టు నది ఇసుకను దోచుకుని రూ.100 కోట్లకుపైగా కూడబెట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇరగవరం, అత్తిలి మండలాల్లో సుమారు 4 వేల ఎకరాల్లో చెరువుల్లో నీరు–చెట్టు పథకం పేరుతో మట్టిని తవ్వి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలించి భారీగా సొమ్ము చేసుకున్నారు. నరసాపురం కాల్వ గట్టును కూడా అడ్డగోలుగా తవ్వేసి మట్టి విక్రయించారు.