-
‘గృహ నిర్మాణం’లో అక్రమాలను నిరూపిస్తా
ఇంద్రకరణ్, ఈటల బహిరంగ చర్చకు రావాలి: రేవంత్ సాక్షి, హైదరాబాద్: హౌసింగ్ బోర్డు పరిధిలో చేపట్టిన హౌసింగ్ జాయింట్ వెంచరు (జేవీ) ప్రాజెక్టుల్లో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఈటల రాజేందర్ అవినీతికి పాల్పడినట్టు రుజువు చేస్తానని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి ప్రకటించారు. అక్రమాలు జరిగాయని నిగ్గుతేల్చిన విజిలెన్సు నివేదికల ఆధారంగా తాను వాస్తవాలను మాట్లాడుతుంటే.. మంత్రులు తప్పుదారి పట్టించేలా మాట్లాడటం తగదని మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. అవినీతి జరగలేదని, అక్రమాల్లో తమ పాత్ర లేదని మంత్రులు ఇంద్రకరణ్, ఈటల రాజేందర్ చెబుతున్నదని వాస్తవమే అయితే బహిరంగ చర్చకు రావడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కాగా, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాక్షేత్రంలో పోరులో భాగంగా ఈటల రాజేందర్ ప్రాతినిథ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో టీటీడీపీ బుధవారం బహిరంగ సభ నిర్వహించనుంది. -
నీళ్లు లేవు..నియామకాలూ లేవు
దోమలగూడ: నిధులు..నీళ్లు..నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆశించిన ప్రయోజనాలు నెరవేరడం లేదని పలువురు వక్తలు అన్నారు హౌసింగ్ బోర్డులో తొలగించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు రెగ్యులర్ చేయాలని కోరుతూ గృహ నిర్మాణ సంస్థ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు వద్ద ఉద్యోగులు రిలే నిరాహారదీక్షలు నిర్వహించారు. దీక్షలకు టీడీపీ ఎమ్మెల్యే కృష్ణయ్య, మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, మాజీ ఎమ్మెల్సీ డాక్టరు నాగేశ్వర్, సీపీఐ నేత గుండా మల్లేష్, బీజేపీ నాయకులు చింతా సాంబమూర్తి, టీజేఏసీ కో చైర్మన్ వెంకట్రెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్లు లేవు, నియామకాలు లేవని, ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నారని అన్నారు. కాంట్రాక్టర్ల కడుపులు నింపేందుకు ఉద్యోగుల పొట్టగొడుతున్నారన్నారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, నిరుద్యోగులకు నిరాశే మిగిలిందన్నారు. రాష్ట్రం ఏర్పాౖటెన తర్వాత సిర్పూర్ కాగజ్నగర్ పేపరు మిల్లు, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తదితర కంపెనీలు మూతపడి వందలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. -
బహిరంగ వేలం ద్వారానే కేటాయింపులు జరగాలి
హౌసింగ్ బోర్డు స్థలాలపై హైకోర్టు వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్ : హౌసింగ్ బోర్డుకు చెందిన స్థలాలను ఎలా పడితే అలా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం సాధ్యం కాదని, కేవలం బహిరంగ వేలం ద్వారా మాత్రమే కేటాయించాలని హైకోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్లోని అమీర్పేట్లో 1,200 చదరపు అడుగుల స్థలాన్ని తమకు కేటాయించేలా హౌసింగ్ బోర్డును ఆదేశించాలని కోరుతూ ఎ.బాలామణి, మరో నలుగురు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తమ ఇంటికి వెళ్లేందుకు మరో దారి లేనందున తమకు ఆ 1,200 చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించాలని బాలామణి తదితరులు 2001లో ప్రభుత్వాన్ని కోరారు. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం చదరపు గజానికి రూ.5 వేలు చెల్లిస్తే స్థలాన్ని ఇవ్వాలని హౌసింగ్ బోర్డును ఆదేశిస్తూ ఆ మేరకు జీవో జారీ చేసింది. అయితే బాలామణి తదితరులు రూ. 5 వేలు చెల్లించలేదు. ఆ తరువాత ఈ జీవో అమలు కోసం హైకోర్టులో బాలామణి తదితరులు పిటిషన్ దాఖలు చేయగా, సింగిల్ జడ్జి దానిని తోసిపుచ్చారు. దీనిపై ధర్మాసనం ముందు మరోసారి అప్పీల్ చేశారు. దీనిని బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమర్థించింది. -
దళితులను మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
పాలకొల్లు అర్బన్ : దళితులను టీడీపీ ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిందని మాలమహానాడు రాష్ట్ర సమన్వయకర్త నల్లి రాజేష్ విమర్శించారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కార్యాలయంలోని మాలమహానాడు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతేడాది ఎస్సీ రుణాల మంజూరు కోసం నోటిఫికేషన్ జారీ చేసి లబ్ధిదారులను ఎంపిక చేశారని, వారికి రుణాలు ఇవ్వకపోగా మళ్లీ ఈ ఏడాది రుణాల మంజూరు కోసం దరఖాస్తులు స్వీకరించడం దళితులను మోసం చేయడమేనన్నారు. ఎంతోమంది ఎస్సీ నిరుద్యోగులు ఉద్యోగం రాకపోయినా కనీసం స్వయం ఉపాధి ద్వారా బతుకుదామనే ఆశతో ఎదురుచూస్తుంటే ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లుజల్లిందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్లో షెడ్యూలు కులాలు నివసించే ప్రాంతాల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయని దుయ్యబట్టారు. ఎస్సీ హాస్టల్స్ మూసివేతకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. దళితుల సమస్యలపై ఈ నెల 12వ తేదీన పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు రాజేష్ తెలిపారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు కర్ణి జోగయ్య, యలమంచిలి మండల అధ్యక్షుడు విప్పర్తి నవీన్, పోడూరు మండల ఉపాధ్యక్షుడు నెల్లి శ్రీనివాస్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మోకా నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. -
జైలు వార్డర్ కిడ్నాప్
రాజమండ్రి రూరల్ : రాజమండ్రి సెంట్రల్ జైలు వార్డర్ను కిడ్నాప్ చేసి రూ.10 వేలు డిమాండ్ చేసిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం రంగంపేట గ్రామానికి కంటిపూడి నరేంద్ర ఉద్యోగాలు వెతుక్కునేందుకు హైదరాబాద్ వెళ్లే నిమిత్తం సోమవారం రాత్రి హౌసింగ్ బోర్డు కాలనీలోని స్నేహితుడు, రాజమండ్రి సెంట్రలు జైలు వార్డర్ అయిన మురళీకిషోర్ ఇంటికి వచ్చాడు. స్నేహితులు ఫణి, ఆనంద్లతో కలిసి దివాన్చెరువులోని ఓ ధాబాకు వెళ్లాడు. అదే ధాబా వద్ద రాజమండ్రికి చెందిన పైడి శాండీ, కరుటూరి చాణక్య, షకిల్ సునందబాబు, అనిరుది శ్యామ్కుమార్లు అప్పటికే మద్యం తాగి ఉన్నారు. తాగిన మైకంలో వారు నరేంద్ర, అతడి స్నేహితులను పరుషపదజాలంతో తిడుతూ గొడవపడ్డారు. ఈలోగా నరేంద్ర జైలు వార్డర్ మురళీ కిషోర్కు ఫోన్లో విషయం తెలిపాడు. దీంతో ఆయన హుటాహుటిన దివాన్చెరువులోని ఆ ధాబావద్దకు వచ్చాడు. ఆయనను శాండీ, అతడి స్నేహితులు బీరు బాటిల్తో కొట్టి, బెదిరించి కారులో ఎక్కించుకుని పరారయ్యారు. నరేంద్రకు వార్డర్ సెల్ ఫోన్ నుంచి కాల్ చేసి రూ.10 వేలు ఇస్తే కానీ కిషోర్ను వదిలేది లేదని చెప్పారు. ఆ డబ్బులు తీసుకుని ఏవీ అప్పారావు రోడ్డులోకి కానీ, సెంట్రల్ జైల్ పెట్రోలు బంకు వద్దకు కానీ రావాలని తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల వరకూ ఈ వ్యవహారం సాగుతూనే ఉంది. దీంతో ఈ విషయాన్ని నరేంద్ర బొమ్మూరు పోలీసులకు తెలిపాడు. వారి సూచన మేరకు డబ్బులు ఇస్తామని చెప్పి పెట్రోలు బంకు వద్దకు పోలీసులతో కలిసి వెళ్లాడు. పోలీసులను గమనించిన నిందితులు వార్డర్ మురళీకిషోర్ను విడిచిపెట్టి పరారయ్యారు. నరేంద్ర ఫిర్యాదు మేరకు బొమ్మూరు ఎస్సై కిషోర్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా వార్డర్ కిడ్నాప్ కేసులో శాండీతోపాటు అతడి స్నేహితులు చాణక్య, సునందబాబు, శ్యామ్కుమార్లను పోలీసులు మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. వారినుంచి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నలుగురు యువకులూ ఇంజనీరింగ్ పూర్తి చేసినట్లు సమాచారం.
Pagination
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- జగన్ పథకాలు కాపీ కొడుతున్న టీడీపీ
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
Advertisement