హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారాన్ని పట్టుకున్నారు. అధికారులు తనిఖీలు చేస్తున్నా.... అక్రమంగా బంగారం తరలింపు మాత్రం ఆగటం లేదు. తాజాగా అరకిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు మంగళవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీల్లో భాగంగా థాయ్లాండ్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు షూలో బంగారాన్ని దాచిన విషయం బయటపడింది. దాంతో నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కాగా బంగారంపై ఆంక్షలు పెరగటంతో శంషాబాద్ విమానాశ్రయం అక్రమ రవాణాకు అడ్డాగా మారుతోంది. విదేశాల నుండి బంగారం అక్రమ రవాణా చేసే వ్యాపారులకు హైదరాబాద్ ప్రధాన ద్వారంగా మారిపోతోంది. మునుపెన్నడూ లేని విధంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకుంటున్నారు.
గత ఏడాది అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు 62 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. దీనివిలువ మార్కెట్ లో రూ.20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. జనవరి, ఫిబ్రవరి నెలలో భారీగానే బంగారాన్ని పట్టుకున్నారు. ఎయిర్ పోర్టు వద్ద అత్యాధునిక పరికరాలు ద్వారా తనిఖీలు చేస్తున్నా కొందరు కనుగప్పి చాకచక్యంగా బంగారాన్ని తీసుకొస్తున్నారు.
'షూ'లో దాచినా అడ్డంగా దొరికిపోయారు
Published Tue, Mar 4 2014 8:48 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement