అసెంబ్లీ ముందుకు 'ప్రివిలేజ్' నివేదిక | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ ముందుకు 'ప్రివిలేజ్' నివేదిక

Published Mon, Mar 21 2016 11:13 AM

అసెంబ్లీ ముందుకు 'ప్రివిలేజ్' నివేదిక - Sakshi

హైదరాబాద్: వైఎస్సార్ సీపీకి చెందిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేయాలని సభా హక్కుల సంఘం సిఫారసు చేసింది. ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నివేదికను స్పీకర్ కోడెల శివప్రసాదరావు  సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎమ్మెల్యే రోజా తమ ఎదుట హాజరుకాకపోవడాన్ని ప్రివిలేజ్ కమిటీ తప్పుబట్టింది. నోటీసులు ఇచ్చినా ఆమె హాజరుకాలేదని నివేదికలో పేర్కొంది.

ఎమ్మెల్యే కొడాలి నానిపై చర్య తీసుకునే అవకాశం సభకే ప్రతిపాదించింది. చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జ్యోతుల నెహ్రులకు మందలింపుతో సరిపెట్టాలని అభిప్రాయపడింది. ప్రివిలేజ్ కమిటీ నివేదికపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement