కేంద్ర అదనపు కార్యదర్శికి రాష్ర్ట అధికారుల వినతి
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా, గోదావరి బేసిన్ పరిధిలో ప్రతి నీటిచుక్కను వాడుకలోకి తెచ్చే లక్ష్యంతో చేపడుతున్న ప్రాజెక్టులకు అవసరమైన సాయం అందించాలని రాష్ర్ట ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. శనివారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర జల వనరుల శాఖ అదనపు కార్యదర్శి అమర్జీత్ సింగ్తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎస్కే జోషి, ప్రభుత్వ సలహాదారులు పాపారావు, విద్యాసాగర్రావు, ఈఎన్సీలు మురళీధర్, విజయప్రకాశ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ పథకం వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
రాష్ట్రంలో రూ.1.05 లక్షల కోట్లు వెచ్చించి 60 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు అధికారులు వివరించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్తగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం, డిండి ఎత్తిపోతల పథకం లక్ష్యాలు, బడ్జెట్ అవసరాలను కేంద్ర అదనపు కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చారు. కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టులకు రూ.75 వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ.10 వేల కోట్లు వెచ్చిస్తామని వెల్లడించారు. సాగునీటి రంగంలో రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం తనవంతు సాయం చేయాల్సిందిగా రాష్ట్రం తరపున విజ్ఞప్తి చేశారు. చిన్న నీటి వనరుల పునరుద్దరణ లక్ష్యంతో చేపట్టిన మిషన్ కాకతీయకు కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి నిధులు ఇవ్వాల్సిందిగా కోరారు.
కేంద్ర పథకాల నిధులు విడుదల చేయండి
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన పేరిట ఏఐబీపీ, ట్రిపుల్ ఆర్ తదితర పథకాలను ఒకేచోట చేర్చి రాష్ట్రాల సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి దేవాదుల ఎత్తిపోతల పథకానికి రావాల్సిన రూ.175 కోట్లు, ట్రిపుల్ ఆర్ పథకం కింద మిషన్ కాకతీయకు రూ.182 కోట్లు తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, ఉద్దేశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని అమర్జీత్ సింగ్ హామీ ఇచ్చినట్లు నీటిపారుదల శాఖ వర్గాలు వెల్లడించాయి.
ప్రాజెక్టులకు సాయం అందించండి
Published Sun, Sep 6 2015 2:17 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
అద్దంకిలో తుఫ్యాన్
స్ట్రాంగ్ రూంలకు పటిష్ట భద్రత కల్పించాలి
నేడు మంగళగిరికి సీఎం వైఎస్ జగన్
డీఎంహెచ్ఓ ఆస్పత్రుల తనిఖీ
పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తాం
అభ్యర్థుల గెలుపునకు సమష్టిగా కృషిచేయాలి
సాయి సుదర్శన్, గిల్ సెంచరీల మోత.. ఆల్ టైమ్ రికార్డు సమం
గురజాల ఎమ్మెల్యే అభ్యర్ధి కాసు మహేష్రెడ్డి
ప్రజల నమ్మకం జగనన్న
బెస్ట్ రెసిడెన్షియల్ కాలనీగా తీర్చిదిద్దుతాం
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement