- మధ్యలో ఖాళీలు లేకుండా మీడియన్స్
- నగరవ్యాప్తంగా 3,000 ట్రాఫిక్ సూచిక బోర్డులు
- వెల్లడించిన ట్రాఫిక్ చీఫ్ రవీందర్
సాక్షి, హైదరాబాద్: మెట్రో పిల్లర్ల కారణంగా జరుగుతున్న ప్రమాదాలను పరిగణనలోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు చక్కదిద్దే చర్యలు ప్రారంభించారు. దీనికోసం మెట్రో రైల్ అధికారులతో కలసి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు నగర సంయుక్త పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) డాక్టర్ వి.రవీందర్ సోమవారం పేర్కొన్నారు. రాజధానిలోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలోనూ మెట్రో రైల్ మార్గం ఉంది. ప్రతి ప్రాంతంలోనూ ప్రధాన రహదారుల మీదుగానే ఈ నిర్మాణాలు జరిగాయి. దీంతో రహదారికి మధ్యలో మెట్రో రైల్ పిల్లర్స్ ఉంటున్నాయి. దీని నిర్మాణం నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో డివైడర్లను సైతం తొలగించారు. దీంతో ఆయా చోట్ల ఏ రెండు మెట్రో పిల్లర్ల మధ్య చూసినా చిన్న చిన్న సిమెంట్ దిమ్మెలు మినహా పటిష్టమైన ఏర్పాట్లు కరువయ్యాయి. ఈ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకున్న ట్రాఫిక్ చీఫ్ ప్రాథమికంగా అన్ని మెట్రో పిల్లర్లకు రేడియం రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు ఏర్పాటు చేయిస్తున్నారు. రాత్రి వేళల్లో వాహనాల లైటు వీటిపైన పడిన వెంటనే అక్కడ పిల్లర్ ఉన్నట్లు మెరుస్తూ సూచిస్తుంది.
అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం స్టిక్కర్లు
అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఈ స్టిక్కర్లు ఉండేలా డిజైన్ చేసిన ట్రాఫిక్ పోలీసులు.. ఆ మోడల్ను మెట్రో రైల్ అధికారులకు అందించారు. త్వరలోనే అన్ని పిల్లర్లకూ ఇవి ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. మరోపక్క మెట్రో పిల్లర్ల మధ్య స్థలం ఖాళీగా ఉండకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం వాటి మధ్య ప్రాంతంలో మీడియన్స్గా పిలిచే తాత్కాలిక సిమెంటు డివైడర్లను ఏర్పాటు చేయనున్నారు. దిశ, వేగ పరిమితి తదితరాలను సూచించే ట్రాఫిక్ సూచిక బోర్డుల్నీ నగర వ్యాప్తంగా ఏర్పాటు చేయడానికి ట్రాఫిక్ పోలీసులు ప్రణాళిక సిద్ధం చేశారు. రేడియో రిఫ్లెక్టివ్ సదుపాయం ఉండే వీటిని తొలి దశలో మూడు వేలు తయారు చేయిస్తున్నారు. వీటిని ఏఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్నది ట్రాఫిక్ ఠాణాల వారీగా నిర్దేశిస్తున్నట్లు రవీందర్ పేర్కొన్నారు. పదికి మించి ఈ–చలాన్లు పెండింగ్లో ఉన్న ఉల్లంఘనులపై న్యాయ స్థానాల్లో చార్జ్షీట్లు దాఖలుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్, రేసింగ్ చేసే వాహనాలకు చెక్ చెప్పడానికి గడిచిన మూడు వారాలుగా చేపట్టిన చర్యలు ఫలితాలు ఇస్తున్నా యని ట్రాఫిక్ చీఫ్ అభిప్రాయపడ్డారు.
మెట్రో పిల్లర్లకు రిఫ్లెక్టర్లు
Published Tue, May 23 2017 12:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 04-10)
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement