హత్యకేసులో నిందితులకు రిమాండ్‌ | Sakshi
Sakshi News home page

హత్యకేసులో నిందితులకు రిమాండ్‌

Published Wed, Nov 23 2016 11:35 PM

remand

 
మాదాపూర్‌ : మాదాపూర్‌లో అన్నదమ్ముల మధ్య గొడవ కారణంగా ఓ వ్యక్తి హత్యకు దారితీసిన ఘటనలో పరారీలో ఉన్న నిందితులను మాదాపూర్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  ఎస్‌ఐ అక్రమ్‌బాబా  మాట్లాడుతూ సిద్ధిఖీనగర్‌లో మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ధర్మేంద్రప్రసాద్‌మిశ్రా, దేవేంద్రప్రసాద్‌మిశ్రా, బీరేంద్రప్రసాద్‌మిశ్రా, మహేంద్రప్రసాద్‌మిశ్రా అనే సోదరులు అద్దెకు ఉంటూ వివిధ కంపెనీల్లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు.
ఈ నెల 18న రాత్రి వారి మధ్య జరిగిన ఘర్షణలో దేవేంద్రప్రసాద్‌మిశ్రాపై  ఇతరులు దాడి చేయడంతో  అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ధర్మేంద్రప్రసాద్‌మిశ్రా గొంతు కోయడంతో అతను ఆస్పత్రి పాలయ్యాడు. కాగా పరారీలో ఉన్న బీరేంద్రప్రసాద్‌మిశ్రా, మహేంద్రప్రసాద్‌మిశ్రాలను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. 

Advertisement
Advertisement