కేబీఆర్ పార్కు వద్ద తిరంగా యాత్ర ప్రారంభం | Sakshi
Sakshi News home page

కేబీఆర్ పార్కు వద్ద తిరంగా యాత్ర ప్రారంభం

Published Sat, Sep 3 2016 8:21 AM

tiranga yatra starts at kbr park

హైదరాబాద్‌: నగరంలోని కేబీఆర్ పార్కు వద్ద బీజేపీ నేతృత్వంలో శనివారం తిరంగా యాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఈ యాత్రను కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఫిల్మ్నగర్, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి మీదుగా 5 కి.మీ మేర ఈ యాత్ర సాగుతోంది. తిరంగా యాత్రలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు కిషన్రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ కార్యకర్తలతోపాటు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement