- కజకిస్తాన్ రాజధాని అస్తానాతో వచ్చేనెలలో ఎంఓయూ
- అస్తానా మేయర్తో సీఎం చంద్రబాబు భేటీలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర నూతన రాజధాని అమరావతి నగర నిర్మాణంలో మరొక కొత్త దేశం కజకిస్తాన్కు కూడా భాగస్వామ్యం కల్పించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. కజకిస్తాన్లో పర్యటిస్తున్న బాబు ఈ మేరకు కజక్ రాజధాని అస్తానాతో రాష్ట్ర రాజధాని నిర్మాణం విషయంలో ఒప్పందం(ఎంవోయూ) చేసుకోనున్నారు.సీఎం నేతృత్వం లోని రాష్ట్ర ప్రతినిధి బృందం ఆదివారం కజకిస్తాన్లో పర్యటించింది. ఈ సందర్భంగా అస్తానా మేయర్ అస్సెట్ లెస్కెషోవ్, సీఎం చంద్రబాబు మధ్య జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి వచ్చేనెలలో ప్రాథమిక అవగాహన ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించారు.
ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒప్పంద పత్రాలపై ఆంధ్రప్రదేశ్ తరఫున వర్కింగ్ గ్రూపునకు పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ నేతృత్వం వహిస్తారంది. రాష్ట్ర వర్కింగ్ గ్రూపులో ఐదుగురు, అస్తానా వర్కింగ్ గ్రూపులో ఐదుగురు చొప్పున సభ్యులుంటారంది. అమరావతి నిర్మాణానికి అస్తానా అనుభవాలను స్వీకరించదలిచామని, అస్తానా నగర రూపశిల్పులు, నిర్మాణ నిపుణుల వివరాలు, వారి అనుభవాలు తమకివ్వాలని సీఎం చంద్రబాబు ఆ దేశ ప్రతినిధుల్ని కోరారని పేర్కొంది. ‘‘పరస్పరం సహకరించుకోవడానికి వీలుగా రోడ్మ్యాప్ను రూపొందించడానికిగాను అమరావతికి రావాలని అస్తానా మేయర్ను చంద్రబాబు ఆహ్వానించారు. కలసి పనిచేయడానికి అంగీకరించిన అస్తానా నగర మేయర్..తమ వర్కింగ్ గ్రూపులోని సభ్యుల పేర్లను రెండు రోజుల్లో ప్రకటిస్తానన్నారు. వచ్చేఏడాది అస్తానాలో జరిగే ఎక్స్పో-2017లో పాల్గొనాలని చంద్రబాబును ఆహ్వానించారు’’ అని వివరించింది.
విమాన సర్వీసులు కూడా
తమ దేశ రవాణాశాఖ మంత్రితో మాట్లాడి అస్తానా నుంచి అమరావతికి నేరుగా విమాన సర్వీసు నడిపేందుకు ప్రయత్నిస్తానని మేయర్ లెస్కెషోవ్ సీఎంకు హామీ ఇచ్చారని, దీనివల్ల పర్యాటకుల సంఖ్య, ఆదాయం పెరిగే వీలుందని రాష్ట్రప్రభుత్వ మీడియా సలహాదారు కార్యాలయం తన ప్రకటనలో వివరించింది.
చంద్రబాబు బృందంతో రష్యాలోని భారత రాయబారి భేటీ
కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో రాజస్థాన్, మహారాష్ట్రల సీఎంలు వసుంధరరాజే, దేవేంద్ర ఫడ్నవీస్లతో కలసి సీఎం చంద్రబాబు ఆదివారం రష్యాలోని ఎకటెరిన్బర్గ్లో ఇన్నోప్రోమ్-2016 ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రష్యాలోని భారత రాయబారి పంకజ్ శరణ్... వీరితో సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు.
రాజధాని నిర్మాణంలో కజక్కు భాగస్వామ్యం
Published Mon, Jul 11 2016 1:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement