టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌ | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌

Published Mon, Jun 5 2017 7:39 AM

today news updates

నేడు నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3డీ1
శ్రీహరికోట: నేడు సాయంత్రం 5:28 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనున్న జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3డీ1. ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రయోగంలో.. 3,136 కిలోల జీశాట్‌-19 సమాచార ఉపగ్రహాన‍్ని జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3డీ1 వాహకనౌక ద్వారా కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.

విద్యాశాఖ డైరెక్టరేట్‌ ముట్టడి
అమరావతి: నేడు విద్యాశాఖ డైరెక్టరేట్‌ను ముట్టడించనున్న ఉపాధ్యాయులు. స్కూళ్ల మూసివేత, అసంబద్ధ బదిలీల నిబంధనలపై ఏపీ టీచర్ల నిరసన.

మందగించిన రుతుపవన విస్తరణ
హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాల విస్తరణ స్వల్పంగా మందగించిందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీంతో తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించడానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉందని తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో రాయలసీమలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి.

నేటి నుంచి ఓయూసెట్‌
ఓయూసెట్‌-2017 పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవాళ జాగ్రఫి, థియెటర్‌ ఆర్ట్స్‌, జియాలజీ, ఎలక్ట్రానిక్స్‌, లింగ్విస్టిక్స్‌ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలు జరగనున్నాయి.

తిరుమలలో పెరిగిన రద్దీ
తిరుమలలో సోమవారం ఉదయం భక్తుల రద్దీ పెరిగింది. 20 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటలు, నడక భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.

ఛాంపియన్స్‌ ట్రోఫీ
ఛాంపియన్స్‌ ట్రోఫీలో నేడు ఆస్ట్రేలియాతో తలపడనున్న బంగ్లాదేశ్‌. సాయంత్రం 6 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం.

Advertisement
Advertisement