ఐటీలో రాష్ట్రానిదే అగ్రస్థానం: ఈటల | Sakshi
Sakshi News home page

ఐటీలో రాష్ట్రానిదే అగ్రస్థానం: ఈటల

Published Sat, Apr 23 2016 3:25 AM

ఐటీలో రాష్ట్రానిదే అగ్రస్థానం: ఈటల - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఐటీ రంగంలో రాబోయే మూడు నాలుగేళ్లలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అసోచామ్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో ‘తెలంగాణలో సులభంగా వ్యాపారం’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఈటల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతుల విలువ రూ.67 వేల కోట్ల మేర ఉందని తెలిపారు.

ఐటీఐఆర్ ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో రూ.10 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. పారిశ్రామిక, గృహ అవసరాలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. టీఎస్‌ఐపాస్ ద్వారా పెట్టుబడులు ఆక ర్షించేం దుకు సింగిల్ విండో విధానంలో పారదర్శకంగా అనుమతులు ఇస్తున్నట్లు ఈటల వెల్లడించారు. పరిశ్రమల శాఖ కమిషనర్ మానిక్కరాజ్, ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్‌మిట్టల్, కార్మిక శాఖ కమిషనర్ అహ్మద్ నదీం తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement