అధికార పార్టీ తీరుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన
సాక్షి, హైదరాబాద్: మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించినా తెలుగుదేశం పార్టీకి మాత్రం ఆయన భయం వదిలినట్టు లేదు. వైఎస్ మరణించి ఐదేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఆయన్ని అకారణంగా తప్పుబట్టడం టీడీపీకి అలవాటుగా మారిందనేది సోమవారం అసెంబ్లీలో మరోసారి రుజువైంది. నకిలీ మద్యం కేసులపై చర్చ సందర్భంగా అధికార టీడీపీ సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పేరును ప్రస్తావిస్తూ విమర్శలకు దిగారు. దీనికి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తీవ్ర అభ్యంతరం చెప్పారు.
‘‘రాష్ట్రంలో ఏది జరిగినా వైఎస్దే బాధ్యతా?! ఆయన (వైఎస్) చనిపోయి ఎన్నేళ్లైంది..? ఐదేళ్లు దాటింది..! ఎన్నికలు జరిగి ఈ ప్రభుత్వం వచ్చి మూడు నెలలు కావొస్తోంది.. అయినా వైఎస్ని వీళ్లు వదలడం లేదు. ప్రతి దానినీ ఆయనకు ఆపాదించడం వీళ్లకు అలవాటైపోయింది’’ అని ఆక్షేపించారు. ‘‘టీడీపీ వాళ్ల తీరు చూస్తుంటే ఈ మూడు నెలల్లో జరిగిన వాటికీ వైఎస్నే బాధ్యుణ్ణి చేయాలన్నట్లుంది. అలాచేయటం టీడీపీకే చెల్లుతుంది.. నిజంగా.. టీడీపీ సభ్యులకే ఆ ఘనత దక్కుతుందేమో’’ అని జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పాలకపక్షం కూర్చున్న వైపు చూస్తూ వారికి ఒక నమస్కారం చేశారు.
ఈ 3 నెలల్లో జరిగిన వాటికీ వైఎస్దే బాధ్యతంటారా?
Published Tue, Sep 2 2014 3:21 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement