లొంగిపోయిన 20 మంది ఉగ్రవాదులు | Sakshi
Sakshi News home page

లొంగిపోయిన 20 మంది ఉగ్రవాదులు

Published Sun, Jul 3 2016 7:25 PM

20 Taliban militants surrender in Afghanistan's Badakhshan

కాబూల్:  ఆఫ్ఘనిస్థాన్ లో ఉగ్రవాదులు లొంగిపోయారు.  బదక్షన్ ప్రావిన్స్ ప్రాంతంలో 20 మంది ఉగ్రవాదులు లొంగిపోయినట్టు ఆదివారం పోలీసు అధికారులు తెలిపారు. మౌలావి ఇక్రముద్దీన్ నాయకత్వంలోని వీరు  తమ ఆయుధాలతో ఫజియాబాద్ లో  పోలీసుల ఎదుట లొంగిపోయారని ఆ దేశ మీడియా వెల్లడించింది. రఘిస్థాన్ జిల్లాలో పోలీసులతో జరిగిన భీకర పోరు అనంతరం వీరు పోలీసులకు లొంగిపోయారు.

Advertisement
Advertisement