బస్తానిండా బాంబులు.. పేలి 63 మంది మృతి | Sakshi
Sakshi News home page

బస్తానిండా బాంబులు.. పేలి 63 మంది మృతి

Published Thu, Jun 18 2015 12:07 PM

బస్తానిండా బాంబులు.. పేలి 63 మంది మృతి

బౌచీ(నైజీరియా): భారీ సంఖ్యలో నాటు బాంబులు ఉన్న గోనెసంచి పేలిపోయి 63 మంది మృత్యువాత పడ్డారు. ఒకప్పుడు బొకోహారమ్ ఉగ్రవాదులు నివాసం ఉన్న క్యాంపులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన అతిపెద్ద బాంబు దాడులను మించిన స్థాయిలో ఓ దాడిలాగా ఇది జరిగింది. అత్యంత భారీ శబ్దంతో ఈ పేలుడు సంభవించింది. అధికారుల సమాచారం మేరకు ఈశాన్య నైజీరియాలోని మోంగునో పట్టణానికి సమీపంలో బొకో హారమ్ ఉగ్రవాదులు గతంలో ఉన్న స్థావరం వద్ద కొన్ని వస్తువులతో నిండిన సంచిని గుర్తించారు. వీరంతా కూడా ఆత్మరక్షణ దళ పౌరులు.

ఆ సంచిని తీసుకొని వెళ్లి అంతా ఒకచోట గుమి కూడా ఆ వస్తువులు ఏమై ఉంటాయా అని చూస్తుండగా ఒక్కసారిగా భారీ విస్ఫోటనం చోటుచేసుకుంది. భారీ శబ్దంతో అన్ని బాంబులు పేలిపోయాయి. దీంతో మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. 63 మంది మృత్యువాత పడ్డారు. పలువురు అంగవైకల్యానికి గురయ్యారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.

Advertisement
Advertisement