అంతరిక్షం నుంచి భూగోళాన్ని చూడొచ్చు | Sakshi
Sakshi News home page

అంతరిక్షం నుంచి భూగోళాన్ని చూడొచ్చు

Published Fri, Mar 11 2016 6:49 PM

అంతరిక్షం నుంచి భూగోళాన్ని చూడొచ్చు

బెర్లిన్: భూమిపైన నిలబడే రోదసిలోకి వెళ్లకుండానే  రోదసిలో నుంచి భూగోళాన్ని ప్రత్యక్షంగా చూడడం, రాత్రి, పగలును ఏకకాలంలో దర్శించడం, రంగురంగుల విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న ప్రపంచ నగరాలను వీక్షించడం సాధ్యమయ్యే పనేనా? ఈ అసాధ్యమైన ఈ అద్భుతాన్ని ‘జర్మన్ ఏరో స్పేస్ సెంటర్ (డీఎల్‌ఆర్)’ సుసాధ్యం చేసింది.  ఒకప్పుడు గ్యాస్‌ను నిల్వచేసేందుకు ఉపయోగించిన పశ్చిమ జర్మనీలోని వందమీటర్ల లోతైన టవర్‌లో ఈ అద్భుత ప్రదర్శనను  ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం, మార్చి 11వ తేదీనే ప్రారంభమైన ఈ ప్రదర్శన డిసెంబర్ 30వ తేదీ వరకు కొనసాగుతుంది.

ఇందులో ప్రదర్శించే గ్లోబ్ 20 మీటర్ల వ్యాసార్థం ఉంటుంది. చుట్టూర అమర్చిన 12 వేర్వేరు వీడియో ప్రొజెక్టర్లతో దృష్యాలను గ్లోబ్‌పైన ప్రొజెక్ట్ చేస్తారు. పది రకాల శాటిలైట్లు అందించిన సమాచారంతో ఈ వీడియోలను రూపొందించారు. మనం చూసే డిజిటల్ సినిమాకన్నా ఎక్కువ సాంద్రతతో వీడియోలను రికార్డు చేశారు. ప్రొజెక్ట్ చేసే ఒక్కో దృశ్యం 5.80 కోట్ల పిక్సల్స్‌తో ఉంటుంది. కోటిన్నర ఇండివిజల్ పిక్చర్స్‌తో కూడాని ఫ్రేమ్స్ సెకండ్‌కు 60 ఫ్రేమ్‌ల చొప్పున కదులుతాయి.

ఈ కారణంగా గ్లోబ్‌పై ప్రొజెక్టయ్యే వీడియోల వల్ల మనకు నేల మీద కూర్చొనే రోదసిలో నుంచి భూమిని ప్రత్యక్షంగా చూస్తున్న భ్రాంతి కలుగుతుంది. రాత్రి, పగళ్లను కూడా అనుభూతి చెందుతూ అంతరిక్షింలో విహరిస్తున్నట్లుగా ఫీలవుతాం. భాషతో ప్రమేయం లేదని, అందరు ఈ ప్రదర్శనను ఎంజాయ్ చేస్తారని డీఎల్‌ఆర్ చీఫ్ నిల్స్ పర్వాసర్ మీడియాకు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement