రంగు.. రుచి.. కొత్త కొత్తగా! | Sakshi
Sakshi News home page

రంగు.. రుచి.. కొత్త కొత్తగా!

Published Sun, May 27 2018 1:35 AM

 Food preparing with gene exchange technology - Sakshi

ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అనే సామెత తెలుసుగా.. ఇదీ అచ్చం అలాంటిదే.. ఇప్పుడు మనం తింటున్నదే.. కానీ సరికొత్తగా వస్తోంది.. శరీరానికి శక్తినేకాదు.. ఆరోగ్యాన్నీ ఇచ్చేలా తయారవుతోంది. జన్యు మార్పిడి సాంకేతికత ఇందుకు మార్గం వేస్తోంది..మరి అలాంటి వినూత్న.. ఉత్తమమైన ఆహారం వివరాలు ఏమిటంటే..

రంగు మారని ఆపిల్‌...
కోసిన కాసేపటికే ఆక్సిడేషన్‌ వల్ల నలుపెక్కడం ఆపిల్‌ లక్షణం. కానీ ఎంత సేపైనా తాజాగానే ఉండే ఆపిల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. అమెరి కాలో గతేడాది నుంచి అందుబాటులో ఉన్న ఈ ఆపిల్స్‌ను ఒకనాగన్‌ స్పెషాలిటీ ఫ్రూట్స్‌ కంపెనీ అభివృద్ధి చేసింది.

మచ్చల్లేని బంగాళాదుంప..
ఎంత జాగ్రత్తగా ఏరుకున్నా బంగాళాదుంపలపై ఒకట్రెండు మచ్చలు ఉండటం, కోసిన కొద్దిసేపటికే రంగు మారడం సహజం. అంతేకాదు బంగాళా దుంపలను వేయిస్తే అక్రిలామైడ్‌ అనే రసాయనం వెలువడుతుంది. అది కేన్సర్‌ కారకమనే అభిప్రాయా లున్నాయి. ఈ ఇన్నేట్‌ పొటాటో అనే సంస్థ ఈ సమస్యకు జన్యు మార్పిడి టెక్నాలజీ ద్వారా చెక్‌ పెట్టింది. ఈ బంగాళ దుంపల్లో నల్లమచ్చలు ఏర్ప డవు సరికదా.. వేయించినప్పుడు వెలువడే అక్రి లామైడ్‌ చాలా తక్కువగా ఉంటుందని నిర్ధారించారు.  

ఆరోగ్యనిచ్చే గ్లుటెన్‌తో గోధుమలు!
జీర్ణ సమస్యలు ఉన్న వారిలో కొందరికి గోధుమలు అస్సలు పడవు. గోధుమలో ఉండే గ్లుటెన్‌ దానికి కారణం. దీంతో కొందరు శాస్త్రవేత్తలు గోధుమల నుంచి గ్లుటె న్‌ను తొలగించి.. ఆరోగ్యాన్నిచ్చే మరో రకమైన పదా ర్థాన్ని జొప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రక మైన జన్యుమార్పిడి గోధుమ కోసం రెండు బృం దాలు ప్రయత్నిస్తున్నాయి. స్పెయిన్‌లో కొత్త గోధుమ వంగడంపై పరీక్షలు కూడా జరుగుతున్నాయి. ఇంకోవైపు గోధుమల్లో మరింత ఎక్కువ పీచు పదార్థం ఉండేలా అభివృద్ధి చేస్తున్నారు.  

అనాస(పైనాపిల్‌) పండుకు రంగు పడింది!
టమాటా పేరు చెప్పగానే ఎరుపు, పైనాపిల్‌ అనగానే పసుపు రంగు గుర్తుకొస్తాయి. కేన్సర్‌ నుంచి రక్షణ కల్పించే లక్షణమున్న లైకోపీన్‌ వల్ల టమాటాలకు ఆ ఎరుపుదనం వస్తుంది. దీంతో పైనాపిల్‌లోనూ అధిక మోతాదులో లైకోపీన్‌ అందేలా చేస్తే.. కేన్సర్‌ను మరింత సమర్థంగా ఎదుర్కోవచ్చని కొందరు శాస్త్రవేత్తలకు ఆలోచన వచ్చింది. దీంతో అధిక మొత్తంలో లైకోపీన్‌ ఉండేలా జన్యుమార్పిడి చేయడంతో.. సరికొత్తగా వంగపండు రంగులో నవనవలాడుతున్న పైనాపిల్‌ తయారైంది.

కొవ్వు తక్కువ నూనెలు...
కొవ్వు తగ్గితే ఆరోగ్యం మెరుగవు తుందని అందరికీ తెలుసు. అందుకే అమెరికాలోని క్యాలి క్స్‌ట్‌ సంస్థ జన్యు మార్పిడి టెక్నా లజీతో ఆవ నూనెలోని సంతృప్త కొవ్వులను సగానికి తగ్గించేసింది. సాధారణంగా ఆవ నూనెలో ఏడు శాతం వరకూ సంతృప్త కొవ్వులుంటే.. క్యాలిక్స్‌ట్‌ అభివృద్ధి చేసిన ఆవ నూనెలో మూడు శాతానికంటే తక్కువే ఉంటుంది. మరోవైపు ఆవ గింజల్లో మరింత ఎక్కువ ఒమేగా–3 కొవ్వులు ఉండేలా నేచర్‌ బయోటెక్నాలజీ, డౌ ఆగ్రో సైన్సెస్‌ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

అరటితో కంటికి మేలు..
ఉగాండాలో ‘మటోకే’ పేరుతో ఓ అరటిపండు రకం ఉంది. అక్కడి వాళ్లు ఇష్టంగా దానిని ‘వండు కుని’ తినేస్తూంటారు. శాస్త్ర వేత్తలు జన్యు మార్పిడి టెక్నాలజీ ద్వారా ఆ అరటిపండులో ప్రొవిటమిన్‌–ఏ ఎక్కువగా ఉత్పత్తయ్యేలా చేశారు. ఈ విటమిన్‌ సరిగా అందకపోతే కంటిచూపు సమస్యలు, అంధత్వం వస్తాయి. ఇప్పుడీ అరటిపండుతో అలాంటి సమస్య తొలగిపోయినట్టే మరి. ప్రస్తుతం ఈ కొత్త అరటిని ఉగాండాలో పరీక్షిస్తున్నారు. అన్నీ సవ్యంగా సాగితే 2021 నాటికి అందరికీ అందుబాటులోకి రానుంది.

బంగారు బియ్యం...  
చాలాకాలంగా గోల్డెన్‌ రైస్‌ గురించి వింటున్నా ఇప్పటì వరకూ మార్కెట్లోకి రాలేదు. విట మిన్‌ ఏ ఎక్కువగా ఉండే ఈ వరి వినియోగానికి పనికొస్తుందని ఆస్ట్రేలియా, న్యూజి ల్యాండ్, కెనడా ప్రకటించాయి. దీంతో త్వరలోనే ఈ బియ్యం అందరికీ అందుబాటులోకి రానున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement