వాషింగ్టన్ : అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు స్వదేశంతో పోల్చితే తమకు అక్కడే సౌకర్యంగా ఉందంటున్నారు. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న 500 మందిపై నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. అవకాశాల భూమి అమెరికా అని భారత్కు చెందిన ఉద్యోగులు భావిస్తున్నారు. అయితే, తమ జాబ్ రిటైర్మైంట్ మాత్రం స్వదేశంలోనే చేయాలనుకోవడం గమనార్హం. తాము చేస్తున్న ఉద్యోగానికి అర్హత కంటే ఎక్కువ నైపుణ్యం తమలో ఉందని సర్వేలో పాల్గొన్న 83 శాతం ఉద్యోగులు చెప్పారు. ఇదిలా ఉండగా, భారత్తో పోల్చితే అమెరికాలో జాబ్ టెన్షన్ చాలా తక్కువగా ఉందని 63 శాతం మంది పేర్కొన్నారు.
ఊహించిన జీతం తాము అందుకుంటున్నామని 65 శాతం మంది, అనుకున్న వేతనాన్ని పొందడానికి అదనపు సమయాన్ని వెచ్చించాల్సి వస్తుందని 61 శాతం ఉద్యోగులు చెప్పారు. ఏది ఏమైతేనేం, స్వదేశంతో పోల్చి చూస్తే తమకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు, డెవలప్మెంట్, తక్కువ ఒత్తిడి వంటివి కలిసొచ్చే అంశాలని అమెరికాలో పనిచేస్తున్న భారతీయులు భావిస్తున్నారని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది.
భారత్ లో కన్నా అమెరికాలోనే పదిలం!
Published Wed, Oct 21 2015 9:52 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement