అక్టోబర్ 1 నుంచి మైసూరులో దసరా ఉత్సవాలు | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 1 నుంచి మైసూరులో దసరా ఉత్సవాలు

Published Fri, Aug 5 2016 1:32 AM

అక్టోబర్ 1 నుంచి మైసూరులో దసరా ఉత్సవాలు - Sakshi

సాక్షి, బెంగళూరు: మైసూరు దసరా ఉత్సవాలను అక్టోబర్ 1 నుంచి 11వ తేదీ వరకూ నిర్వహించనున్నారు. వరుస కరువుల నేపథ్యంలో గతేడాది ఉత్సవాలను సాదాసీదాగా నిర్వహించారు. ఈ ఏడాది కర్ణాటకలో మంచి వర్షాలు పడుతుండటంతో ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఉత్సవాల్లో ఆకర్షణీయమైన జంబు సవారీ అక్టోబర్ 11న జరగనుంది. బెంగళూరులోని విధానసౌధలో గురువారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ విషయాన్ని  వెల్లడించారు.

Advertisement
Advertisement