జైలులో గత 68 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ఖైదీ ఆరోగ్యం విషమించింది. ఈ విషయాన్ని పాలస్తీనా ఖైదీల వ్యవహారాల కమిటీ తెలిపింది. మహ్మద్ అల్ బల్బౌల్ (21) అనే ఈ ఖైదీ జూలై 4వ తేదీన నిరాహారదీక్ష మొదలుపెట్టాడు. ప్రస్తుతం అతడిని టెల్ అవివ్ సమీపంలోని అస్సఫ్ హరొఫె ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడిని విడుదల చేయాల్సిందిగా ఇజ్రాయెల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసినట్లు ఓ ప్రతినిధి చెప్పారు. తన అన్నతోపాటు జూన్ 9న బల్బౌల్ను పోలీసులు అరెస్టుచేసి జైల్లో పెట్టారు. ప్రస్తుతం అతడికి పోషకాహార లోపం వల్ల తాత్కాలిక అంధత్వం కూడా వచ్చింది. గంటగంటకూ అతడి ఆరోగ్యం బాగా విషమిస్తోంది.
అతడికి బలవంతంగా ఆహారం ఇవ్వొద్దని, అలా చేయడం కూడా ఒక రకమైన హింస అవ్వడంతో పాటు అది వైద్య పరమైన విలువలకు విరుద్ధమని పాలస్తీనా ఆరోగ్యశాఖ మంత్రి జవద్ అవాద్ జైలు అధికారులకు తెలిపారు. వైద్య చికిత్సను నిరాకరించే హక్కు రోగులకు ఉంటుందని ఆయన అన్నారు. ఎలాంటి ఆరోపణలు లేకపోయినా పాలస్తీనా పౌరులను ప్రభుత్వం అరెస్టు చేసి, జైళ్లలో పెడుతోంది. ఇలాంటి కేసులలో గరిష్ఠంగా ఆరు నెలల పాటే జైల్లో ఉంచే అవకాశం ఉన్నా.. తర్వాత దాన్ని ఎంతకాలమైనా పొడిగించవచ్చు.
68 రోజులుగా నిరాహారదీక్ష.. ఖైదీ ఆరోగ్యం విషమం
Published Tue, Sep 6 2016 7:33 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement