* దిగ్విజయంగా తోకచుక్కపై దిగిన ఫీలే ల్యాండర్
* పదేళ్లు ప్రయాణించి ల్యాండర్ను జారవిడిచిన రోసెట్టా వ్యోమనౌక
* ఖగోళ చరిత్రలో అద్భుత ఘట్టం
* ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈసా) అరుదైన విజయం
* చైనాకు మోదీ పరోక్ష చురక
* దక్షిణ చైనా సముద్రంలో శాంతి నెలకొనాలని ఆకాంక్ష
లండన్: ఖగోళ చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది. తొలిసారిగా ఓ తోకచుక్క చేతికి చిక్కింది. ‘67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో’ అనే తోకచుక్కను వెంటాడుతూ పదేళ్లుగా అంతరిక్షంలో ప్రయాణించిన ఐరోపా అంతరిక్ష సంస్థ(ఈసా)కు చెందిన రోసెట్టా వ్యోమనౌక ఎట్టకేలకు ఫీలే ల్యాండర్ను తోకచుక్కపైకి జారవిడిచింది. తోకచుక్కపై తమ ఫీలే ల్యాండర్ విజయవంతంగా దిగిందని బుధవారం ఈసా ప్రకటించింది. దీంతో ఓ తోకచుక్కపై తొలిసారిగా వ్యోమనౌకను దింపిన ఘనతను ఈసా సొంతం చేసుకుంది. తోకచుక్కలపై అధ్యయనం ద్వారా 450 కోట్ల ఏళ్ల క్రితం సౌరకుటుంబం ఏర్పడినప్పటి పరిస్థితుల గురించి తెలుసుకోవచ్చు. అందుకే సుమారు 160 కోట్ల డాలర్ల ఖర్చుతో ఈసా ఈ ప్రయోగం చేపట్టింది.
ఉత్కంఠగా ఆ ఏడుగంటలు...
ప్రతి ఆరున్నరేళ్లకోసారి సూర్యుడిని చుట్టి వస్తున్న ‘67పీ’ తోకచుక్క సెకను 18 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ 12 గంటలకోసారి తనచుట్టూ తాను తిరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ తోకచుక్క సమీపంలోకి వెళ్లి, దాని చుట్టూ తిరుగుతూనే ల్యాండర్ దానిపై పడేలా జారవిడవటం అనేది అతిక్లిష్టమైన ప్రక్రియ కావడంతో ఈసా శాస్త్రవేత్తల్లో ఉత్కంఠ నెలకొంది. 2004లో నింగిలోకి వెళ్లిన రోసెట్టా పదేళ్లుగా తోకచుక్క వెంటాడుతూ ఈ ఏడాది సెప్టెంబరులో దాని సమీపంలోకి చేరి చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ల్యాండర్ను జారవిడిచింది. సుమారు ఏడు గంటల పాటు 20 కి.మీ. దూరం కిందికి దిగిన ఫీలే ఎట్టకేలకు తోకచుక్కపై దిగిపోయి కొక్కేలను గుచ్చి దిగబడిపోయింది.
తోకచుక్కపై తొలి అడుగు!
Published Thu, Nov 13 2014 4:17 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
Advertisement