వాషింగ్టన్: డెముక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తో జరగనున్న చర్చాగోష్ఠికి బిల్ క్లింటన్ మాజీ ప్రియురాలు జెన్నిఫర్ ఫ్లవర్స్ ను తీసుకువస్తానని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. హిల్లరీ, ట్రంప్ మంగళవారం తమ తొలి అధ్యక్ష అభ్యర్థుల చర్చాగోష్ఠిలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ‘డోపి’ మార్క్ కుబన్ ను హిల్లరీ ఆహ్వానించారని, తాను జెన్నిఫర్ ఫ్లవర్స్ ను తీసుకువస్తానని అన్నారు. ‘ఒకవేళ ఈ కార్యక్రమానికి మార్క్ కుబన్ వచ్చి ముందు వరుసలో కూర్చుంటే.. అతడి కుడివైపున జెన్నిఫర్ ఫ్లవర్స్ ను తీసుకొచ్చి కూర్చోబెడతాన’ని ట్రంప్ ట్వీట్ చేశారు.
ట్రంప్ పై మార్క్ కుబన్ గతంలో పలుమార్లు బహిరంగంగా విమర్శలు చేశారు. కాగా, ట్రంప్ ప్రకటనపై జెన్నిఫర్ ఫ్లవర్స్ సోషల్ మీడియాలో స్పందించారు. చర్చాగోష్ఠికి తాను కూడా వస్తున్నానని తెలిపారు. ఆమెను తాము ఆహ్వానించలేదని ట్రంప్ కాంపెయిన్ మేనేజర్ కెలియానె కన్వే తెలిపారు. ట్రంప్ తరపున అతిథిగా ఆమె రావాలని కోరుకోవడం లేదని చెప్పారు. హిల్లరీ, ట్రంప్ తొలి చర్చాగోష్ఠి కోసం అమెరికా ప్రజలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
‘క్లింటన్ మాజీ ప్రియురాలిని తీసుకొస్తా’
Published Mon, Sep 26 2016 5:13 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
Advertisement