Sakshi News home page

టీవీ నటి, యాంకర్‌ మల్లిక మృతి

Published Mon, Oct 9 2017 3:18 PM

Anchor, Tv actress  Mallika dies after illness

బెంగళూరు : టీవీ నటి, యాంకర్‌ మల్లిక (39) అనారోగ్యంతో మృతి చెందారు. గత 20 రోజులుగా ఆమె కోమాలో ఉన్నారు. మల్లిక సోమవారం ఉదయం  ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో మరణించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మహేష్‌ బాబు హీరోగా నటించిన ‘రాజకుమారుడు’ చిత్రంలో మల్లిక నటించారు. అలాగే పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించారు. ఆమె అసలు పేరు అభినవ. జెమిటీ టీవీలో ప్రసారం అవుతున్న ‘నాతిచరామి’  సీరియల్‌లోనూ మల్లిక నటించారు.

కాగా మల్లిక అంత్యక్రియలు మంగళవారం హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఆమెకు  భర్త విజయ్‌ సాయి, కుమారుడు కృష్ణ ప్రసాద్‌ ఉన్నారు. తొలి తరం టీవీ యాంకర్ గా మల్లిక ప్రజాభిమానం చూరగొన్నారు. ఎమోషనల్‌ సీన్స్‌లో నాలుగు అయిదు పేజీల డైలాగ్స్‌ను కూడా సింగిల్‌ టేక్‌తో చేసేవారు. పెళ్లి అనంతరం ఆమె కొంతకాలం నటనకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత బుల్లితెరకు రీ ఎంట్రీ ఇచ్చి పలు సీరియల్స్‌లో నటించారు. మల్లిక నేషనల్‌ బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్‌ కూడా. ఆమె మృతి పట్ల పలువురు బుల్లితెర నటీనటులు సంతాపం తెలిపారు.

Advertisement
Advertisement