ఒక్క హిట్తో రెమ్యూనరేషన్ డబుల్! | Sakshi
Sakshi News home page

ఒక్క హిట్తో రెమ్యూనరేషన్ డబుల్!

Published Wed, Oct 19 2016 3:57 PM

ఒక్క హిట్తో రెమ్యూనరేషన్ డబుల్!

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన బాలీవుడ్ చిత్రం 'ఎంఎస్ ధోనీ: ద అన్టోల్డ్ స్టోరీ' బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా ఇప్పటికే 200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్టు నిర్మాతలు ప్రకటించారు. దీంతో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్ల యజమానులకు లాభాలను తెచ్చిపెట్టింది. కథ కోసం నిర్మాతలు పెద్ద మొత్తంలో డబ్బును ధోనీకి చెల్లించినట్టు వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన హీరో సుషాంత్ సింగ్ రాజ్పుట్కు బాగా కలసి వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో సుషాంత్ తన రెమ్యూనరేషన్ను రెండింతలు పెంచాడట.

సుషాంత్ కెరీర్లో ఇదే భారీ హిట్ చిత్రం. ఎంఎస్ ధోనీ సినిమాలో నటించిన తర్వాతే అతనికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత చేయబోయే ప్రాజెక్టులకు సుషాంత్ 3.5 నుంచి 4 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కాగా సుషాంత్ నిర్ణయంపై కొందరు నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎంఎస్ ధోనీకున్న క్రేజ్ వల్ల గాక, తన వల్లే ఈ సినిమా హిట్ అయిందని సుషాంత్ భావిస్తున్నాడని, ఇదే సమస్య అని ఓ నిర్మాత వ్యాఖ్యానించాడు.

బయోపిక్ సినిమాల్లో బిగ్గెస్ట్ ఓపెనర్గా, ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో సుల్తాన్ తర్వాత అత్యధిక వీకెండ్ కలెక్షన్లు సాధించిన రెండో చిత్రంగా ఎంఎస్ ధోనీ నిలిచింది. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుషాంత్ సింగ్ రాజ్పుట్ టైటిల్ రోల్లో నటించాడు.  మొత్తమ్మీద ఈ సినిమా అందరికీ కలసివచ్చింది.

Advertisement
Advertisement