జూలై దాకా ఆగాల్సిందే! | Sakshi
Sakshi News home page

జూలై దాకా ఆగాల్సిందే!

Published Tue, Apr 28 2015 11:29 PM

జూలై దాకా ఆగాల్సిందే! - Sakshi

వేసవి కానుకగా ‘బాహుబలి’ చిత్రం ఈ మే నెలలో థియేటర్లలో సందడి చేస్తుందని అభిమానులు చాలా సంబరపడ్డారు. కానీ వారి నిరీక్షణను పొడిగిస్తూ, విడుదల జూలైకి వాయిదా పడింది. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి ట్విటర్‌లో వెల్లడించారు. ‘‘ఈ సినిమా కోసం 17 వీఎఫ్‌ఎక్స్ స్టూడియోలలో 600 మంది సాంకేతిక నిపుణులు రెండు షిఫ్ట్‌ల్లో పనిచేస్తున్నారు. అయినా, అనుకున్న సమయానికి తీసుకురాలేకపోతున్నాం’’ అని ఆయన చెప్పారు. సినిమా సంగతెలా ఉన్నా, ప్రచార చిత్రం మాత్రం మే 31న విడుదల కానుంది.

Advertisement
Advertisement