స్కామ్లలో ఆయన ప్రమేయం ఉంది: మాజీ కాగ్ వినోద్ రాయ్
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై మాజీ కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) గురువారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యూపీఏ సంకీర్ణ ప్రభుత్వ అధినేతగా మన్మోహన్ సింగ్ వ్యవహార శైలిని, ఆయన నేతృత్వంలో సాగిన సంకీర్ణ రాజకీయాలను కూడా తూర్పారబట్టారు. మన్మోహన్ కేవలం, పదవిలో సుదీర్ఘకాలం కొనసాగడానికే ప్రాధాన్యం ఇచ్చారంటూ దుయ్యబట్టారు. 2జీ స్పెక్ట్రం, బొగ్గు క్షేత్రాల కేటాయింపు వ్యవహారంలో మన్మోహన్ సింగ్కు ప్రమేయం ఉందన్నారు. ఆడిట్ నివేదికల్లో ప్రధాన మంత్రి పేరు ప్రస్తావన కూడా లేకుండా చేయడానికి కాంగ్రెస్ నేతలు పలువురు తనపై ఎన్నో ఒత్తిళ్లు తీసుకువచ్చారని వినోద్ రాయ్ చెప్పారు. టైమ్స్ నౌ టీ వీ న్యూస్ చానల్కు, అవుట్లుక్ మ్యాగజైన్కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలలో ఆయన ఈ తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలో ఉంటూ, నిజాయితీగా వ్యవహరించడం కేవలం ఆర్థికపరమైన అంశం మాత్రమేకాదని, అది మేధస్సుతోను, వృత్తినైపుణ్యంతోనూ కూడుకున్న వ్యవహారమని ఆయన మన్మోహన్ సింగ్కు సూచించారు.
రాజ్యాంగం పేరుమీద ప్రమాణం స్వీకరించిన సంగతిని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. రాజ్యం చేతిలో జాతిని అణచివేతకు గురికానివ్వరాదని, మంచి రాజకీయాలు సరైన ఆర్థిక వ్యవహారాలకు దారి తీయాలని, అయితే మంచి రాజకీయాలంటే ఎక్కువకాలం పదవిలో కొనసాగడమని ఎలా అనుకుంటామని ప్రశ్నించారు. తాను పదవిలో ఉండగా తన టెలిఫోన్ను యూపీఏ ప్రభుత్వం ట్యాప్ చేసిందన్నారు. 2జీ స్పెక్ట్రమ్ను మొదట వచ్చినవారికి మొదట అనే ప్రాతిపదికన కేటాయించడం, బొగ్గు బ్లాకులను వేలం లేకుండా కట్టబెట్టడం వంటి నిర్ణయాల్లో మన్మోహన్ సింగ్కు పాత్ర ఉందన్నారు. 2జీ, బొగ్గు బ్లాకుల వ్యవహారాల్లో మన్మోహన్ తన బాధ్యత నుంచి తప్పించుకోజాలరన్నారు.
రాయ్ ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు
►2జీ వ్యవహారంలో అప్పటి కేంద్రమంత్రి ఏ రాజా తన లేఖలను ప్రధానికే రాశారు. వాటికి ప్రధానే స్వయంగా తిరుగు జవాబులు రాశారు. నేను రాసిన లేఖలకు మాత్రం బదులివ్వలేదు.
► 2జీ వ్యవహారంలో నష్టాన్ని రూ. 1.76లక్షల కోట్లుగా లెక్కగట్టడం సరికాదని 2010 నవంబర్ 16న మన్మోహన్ నాతో అన్నారు. మీరు నేర్పించిన ఆర్థిక గణితశాస్త్ర పద్ధతిలోనే ఆ లెక్కవేశానంటూ ఆయనకు బదులిచ్చాను.
► రిలయన్స్ ఇండస్ట్రీస్ కేసు విషయంలో మంత్రి స్థాయిలో నిర్ణయం జరగనే లేదు. ముకేశ్ అంబానీయే అంతా నడిపించారు.
► 2జీ, బొగ్గు బ్లాకుల ఆడిట్ నివేదికలో ప్రధాని పేరు ప్రస్తావించరాదంటూ సందీప్ దీక్షిత్, సంజయ్ నిరుపమ్, అశ్వనీ కుమార్ వంటి కాంగ్రెస్ ఎంపీలు నాపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు.
►2జీ కుంభకోణం జరక్కుండా ప్రధాని హోదాలో మన్మోహన్ చర్యలుతీసుకుని ఉండవచ్చు. ఎందుకంటే, ప్రకృతి వనరులను వేలంలేకుండా కేటాయించడం సరికాదని ఆయన మంత్రివర్గమే సూచించింది.
►కోల్బ్లాక్ కే టాయింపులో ఉన్న లోపాలను, దిద్దుబాటు చర్యలను గురించి, నేను, ప్రణబ్ మఖర్జీతో కలసి మన్మోహన్ సింగ్ వివరించినా ప్రయోజన లేకపోయింది.
►సంకీర్ణ ఒత్తిళ్ల వల్లే యూపీఏ సర్కారు స్కామ్లపై తగు రీతిలో స్పందించలేదు.
(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)
2జీ, కోల్గేట్లో మన్మోహన్!
Published Fri, Sep 12 2014 1:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement