టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు మరో మిస్ ఇండియాను పరిచయం చేసే పనిలో నాగార్జున పనిలో పడ్డారు. ఈసారి ఆయన పక్కన కాకుండా తన కుమారుడు నాగచైతన్య కు జోడిగా మాజీ మిస్ ఇండియా పూజా హెగ్డేను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.
అంతేకాకుండా నాగ చైతన్య కెరీర్ ను జాగ్రత్తగా తీర్చి దిద్దే పనిలో నాగ్ పడ్డారట. అందులో భాగంగానే గుండె జారి గల్లంతయ్యిందే చిత్రానికి దర్శకత్వం వహించిన విజయ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య నటించే చిత్రంలో కొత్త తార పూజాను పరిచయం చేయాలని నాగ్ భావిస్తున్నారట. తడాఖా చిత్రం తర్వాత నాగ చైతన్య చేస్తున్న ఈ చిత్రం హిట్ గా మలిచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేపట్టారు.
రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర ప్రధానమైంది అని.. డ్యాన్స్ కే పరిమితం కాకుండా నటనకు కూడా స్కోప్ ఉండటంతో పూజా హెగ్గేకు ట్రైనింగ్ ఇవ్వాలని యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే పూజా హెగ్డే ఎంపికను అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.