మళ్లీ సమ్మోహనం | Sakshi
Sakshi News home page

మళ్లీ సమ్మోహనం

Published Sat, Dec 6 2014 10:55 PM

మళ్లీ సమ్మోహనం - Sakshi

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను మరోసారి సమ్మోహన పరిచేందుకు నాగార్జున సిద్ధమయ్యారు. ‘మా’ టీవీ చరిత్రలోనే అద్భుతమైన రేటింగ్స్ సాధించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో సిరీస్ ఈ సోమవారం నుంచే మొదలు కానుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ వారానికి అయిదు రోజులు రాత్రి 9.30 గంటలకు ఈ షో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా మా టీవీ చైర్మన్ ఎన్. ప్రసాద్ మాట్లాడుతూ -‘‘నమ్మలేని విధంగా జీవితాన్ని మార్చేసే షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. విజ్ఞానాన్ని అందించడం ద్వారా సామాజికంగా మంచి మార్పుని తీసుకొచ్చే సమర్థత ‘మా’ టీవీకి ఉందనడానికి నిదర్శనం లాంటి షో ఇది’’ అని చెప్పారు.
 

Advertisement
Advertisement