తన వైవాహిక జీవితం విజయవంతంగా సాగడానికి ప్రత్యేక కారణమేమీ లేదని బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గణ్ తెలిపాడు. రహస్య మంత్రం కూడా ఏదీలేదన్నాడు. 1999లో అజయ్... కాజోల్ను వివాహమాడాడు. వీరికి కుమార్తె న్యాస, కుమారుడు యుగ్ ఉన్నారు. ‘ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని నేను అనుకుంటాను. అదేవిధంగా ఇతరులను కూడా సంతోషంగా ఉంచాలని కోరుకుంటాను. ఇతరులకు కూడా మీరు తప్పనిసరిగా తగినంత ప్రాధాన్యం ఇవ్వాలి. వారిని జీవితాంతం గౌరవించాలి. ప్రతి ఒక్కరికీ కట్టుబాటు అవసరం. ఆవిధంగా ఉంటే అంతా సజావుగానే సాగుతుంది’ అని అన్నాడు. వివాహాలకు బాలీవుడ్ క్లిష్టమైన వేదిక అని అజయ్ ఎంతమాత్రం భావించడం లేదు. ‘ మరోచోట ఏవిధంగా జరుగుతుందో ఇక్కడ కూడా అంతే. వారి వారి భావాలపై ఇది ఆధారపడి ఉంటుంది’ అని అన్నాడు.
కాగా అజయ్.. త్వరలో రెండు మసాలా చిత్రాల్లో కనిపించనున్నాడు. అందులో ఒకటి ప్రభుదేవా దర్శకత్వంలో వస్తున్న ‘యాక్షన్ జాక్సన్’ కాగా మరొకటి రోహిత్శెట్టి దర్శకత్వ సారథ్యంలో రూపొందనున్న ‘సింగం-2’. ‘యాక్షన్ జాక్సన్’ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా ‘సింగం-2’ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. ఇదిలాఉంచితే ‘సిర్టెక్స్ ఈజీ’ అనే సంస్థకు అజయ్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నాడు. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై ఇప్పటికే సంతకం చేశాడు. గోవాలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో ‘సిర్టెక్స్ ఈజీ’ బ్రాండ్ను ఆవిష్కరించాడు. ‘ప్రతి విషయాన్ని గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ‘సిర్టెక్స్ ఈజీ’ బ్రాండ్ నాకు మహా గొప్పగా అనిపించింది. మంచి నాణ్యతకు మారుపేరు. ఎంతో సౌకర్యవంతంగా కూడా ఉంటుంది’ అని అన్నాడు. నిశితంగా పరిశీలించాకే ఈ నిర్ణయానికొచ్చానన్నాడు.