మళ్లీ మళ్లీ ఇది రాని రోజు | Sakshi
Sakshi News home page

మళ్లీ మళ్లీ ఇది రాని రోజు

Published Fri, Jan 3 2014 2:16 AM

మళ్లీ మళ్లీ ఇది రాని రోజు

‘ఓనమాలు’ చిత్రంతో సెన్సిబుల్ డెరైక్టర్ అనిపించుకున్న క్రాంతిమాధవ్ మరో విభిన్న ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో శర్వానంద్, నిత్యామీనన్ నటిస్తున్నారు. వీరిద్దరూ కథ వినగానే సెకండ్ థాట్ లేకుండా ప్రాజెక్ట్‌కి పచ్చ జెండా ఊపారట. అగ్ర నిర్మాత కేఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలు కానుంది. చిరంజీవి-కేఎస్ రామారావు కాంబినేషన్‌లో వచ్చిన ‘రాక్షసుడు’ చిత్రంలోని ఓ పాట పల్లవి ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ని ఈ చిత్రానికి టైటిల్‌గా అనుకుంటున్నారట.

Advertisement
Advertisement