‘‘మా గత చిత్రం ‘వైశాఖం’ నాకు చాలా సంతృప్తినిచ్చింది. ఆడియన్స్ కూడా బాగా అప్రిషియేట్ చేశారు. ఆ సినిమాలో ఇచ్చిన మెసేజ్ అందరికీ నచ్చింది. అంతకుముందు తీసిన ‘లవ్లీ’ అప్రిషియేషన్స్తో పాటు కమర్షియల్గా కూడా మంచి సక్సెస్ అయింది. ‘లక్కీ ఫెలో’ సినిమా ‘లవ్లీ’ కంటే పెద్ద íß ట్ అవుతుంది’’ అని దర్శకురాలు జయ బి. అన్నారు. బుధవారం ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా జయ బి. తన కొత్త చిత్రం వివరాలను, ఇతర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
►ప్రస్తుతం కొత్త సినిమా ‘లక్కీ ఫెలో’ ప్రీ–ప్రొడక్షన్ పనులు చేస్తున్నాం. ఇది ‘వైశాఖం’ అంత లేట్ అవ్వదు. జూన్లో స్టార్ట్ చేసి నాలుగైదు నెలల్లో కంప్లీట్ చేస్తాం. మనలో కొంతమందికి అనుకోకుండా ఒక పెద్ద అవకాశం వస్తుంది. ఆ వ్యక్తిని అందరం ‘లక్కీ ఫెలో’ అంటాం. ఈ సినిమాలో హీరో లక్కీ ఫెలో. ఆ లక్ను అతను ఎలా తీసుకుంటాడు? అన్నది కథాంశం. హ్యూమన్ సైకాలజీని బేస్ చేసుకొని కథ తయారు చేశాం.
►హీరోయిన్ది కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. సమాజంలో ఆడవాళ్లకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అలాగని పెద్దవి ఉండవని కాదు. చిన్న సంఘటన అయినా మానసికంగా బాగా డిస్ట్రబ్ చేస్తుంది. టీనేజ్ అమ్మాయిలకైతే మరీను. హీరోయిన్ ఇలాంటి సెన్స్టీవ్ క్యారెక్టర్ని డీల్ చేస్తుంది. ఇప్పటివరకూ ఎవరూ ఈ పాయింట్ని టచ్ చేయలేదు. ఇప్పుడున్న యంగ్ హీరో హీరోయిన్లనే సెలెక్ట్ చేసుకుంటాం.
►నా ఫస్ట్ సినిమా ‘చంటిగాడు’ నుంచి ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వలేదు. ఎంటర్టైన్మెంట్తో పాటు అండర్ కరెంట్లో మెసేజ్ ఉంటుంది. త్వరగా సినిమాలు తీసేసి ఆ తర్వాత జనంలోకి వెళ్లి సమాజానికి ఉపయోగపడే పనులేవైనా చేయాలని ఉంది. నేను జర్నలిస్టుగా ఉన్న రోజుల్లో కూడా నన్ను చూసి ఇన్స్పైర్ అయి, జర్నలిజంలోకి వచ్చినవాళ్లు చాలామంది ఉన్నారు. మహిళా దర్శకుల సంఖ్య పెరగాలి. మగాళ్లు ఇంకా ఆడవాళ్లు అప్పడాలు చేయడానికి, వండటానికి మాత్రమే అనుకుంటున్నారు. ఆ ఆలోచనలో మార్పు రావాలి.
ఆడవాళ్లంటే వంట చేయడానికే కాదు
Published Thu, Jan 11 2018 12:15 AM
Related news
-
డైనమిజ(య)ం
తెలుగు పరిశ్రమలో అతి తక్కువ మంది మహిళా దర్శకుల్లో ఒకరైన బి. జయ గురువారం తుది శ్వాస విడిచారు. 1964 జనవరి 11న జన్మించారామె. చెన్నై యూనివర్శిటీలో యం.ఎ ఇంగ్లీష్, అన్నామలై యూనివర్శిటీలో యం.ఎ సైకాలజీ పూర్తి చేయడంతో పాటు జర్నలిజంలో డిప్లొమా కూడా సంపాదించారు జయ. 1986లో పాత్రికేయురాలిగా కెరీర్ ఆరంభించి, పలు ప్రముఖ పత్రికల్లో పని చేశారు. మరోవైపు కథలు, నవలలు కూడా రాసేవారు. సుమారు 50కు పైగా షార్ట్ స్టోరీలు, కొన్ని సీరియల్స్, నవల్స్ రాశారు. తెలుగు, తమిళ, ఇంగ్లీష్లో 100కు పైగా కార్టూన్స్ వేశారు. ‘ఆనందో బ్రహ్మ’ అనే షార్ట్ స్టోరీకి నేషనల్ అకాడమీ అవార్డ్ అందుకున్నారు. ‘స్పర్శ’, ‘నీతి’ కథలకు కూడా అవార్డులు దక్కాయి. పాత్రికేయుడు బీఏ రాజుని పెళ్లాడిన అనంతరం ఆరంభించిన ‘సూపర్ హిట్’ పత్రికకు ఎగ్జిక్యూటివ్గా వ్యవహరించారు. డైనమిక్ జర్నలిస్ట్ అనిపించుకున్న జయకు డైరెక్టర్ అవ్వాలనే ఆకాంక్ష ఉండేది. దర్శకురాలు కాకముందు దీపక్, అంకిత జంటగా నటించిన ‘ప్రేమలో పావనీ కల్యాణ్’ సినిమాకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. డైరెక్టర్గా జయ ఫస్ట్ సినిమా ‘చంటిగాడు’ (2003). బాల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలాదిత్యను హీరోగా, సుహాసినిని హీరోయిన్గా పరిచయం చేస్తూ జయ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మలి ప్రయత్నంగా 2005లో యువరాజ్, రిషీ గిరీశ్ హీరోలుగా కామ్నా జెఠ్మలానీని హీరోయిన్గా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘ప్రేమికులు’. ఆ తర్వాత కమెడియన్ అలీని హీరోగా పెట్టి రూపొందించిన చిత్రం‘ గుండమ్మగారి మనవడు’. 2008లో ‘సవాల్’, ఆ తర్వాత ఆది సాయికుమార్ హీరోగా, శాన్వీని హీరోయిన్గా పరిచయం చేస్తూ రూపొందించిన లవ్స్టోరీ ‘లవ్లీ’. డైరెక్టర్గా బి.జయకు, హీరోగా ఆది సాయికుమార్కు ‘లవ్లీ’ పెద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. ‘లవ్లీ’ తర్వాత కొత్త నటీనటులతో తెరకెక్కించిన ‘వైశాఖం’ (2017) కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఈ చిత్రాలను ఆర్జే బ్యానర్పై బీఏ రాజు నిర్మించారు. ‘వైశాఖం’ తర్వాత ‘లక్కీ ఫెల్లో’ పేరుతో జయ, రాజు ఓ చిత్రం చేయడానికి ప్లాన్ చేశారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లాల్సి ఉంది. ఈలోపే ఊహించని విధంగా ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్లారు. జర్నలిజమ్ నుంచి సినిమా డైరెక్షన్ వరకూ జయ సాధించిన విజయాలెన్నో. డైనమిక్ జర్నలిస్ట్, డైనమిక్ డైరెక్టర్, డైనమిక్ లేడీ అనిపించుకున్న జయ ఇటు పాత్రికేయ రంగంలోనూ, అటు సినిమా రంగంలోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఆమె మరణం తీరని లోటు అని పలువురు పాత్రికేయులు, సినీ రంగ ప్రముఖులు పేర్కొన్నారు. జయ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. బి. జయకు ప్రముఖుల నివాళి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, హీరో మహేశ్బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్, దర్శకులు రేలంగి నరసింహారావు, పూరి జగన్నాథ్, ఆయన సతీమణి లావణ్య, కుమారుడు ఆకాశ్, దర్శకుడు వంశీ పైడిపల్లి, నటుడు ఉత్తేజ్, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, కె.ఎస్. రామారావు, దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాతలు బెల్లంకొండ సురేశ్, అనీల్ సుంకర, నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), సి.కల్యాణ్, శోభారాణి, రచయితలు చిన్నికృష్ణ, భాస్కర భట్ల, నటీమణులు చార్మీ, హేమ, అపూర్వ, నటి–దర్శకురాలు జీవిత తదితరులు జయకు నివాళులర్పించారు. జయగారు మన మధ్య లేరనేది జీర్ణించుకోలేనిది. చెన్నయ్లో ఉన్నప్పటి నుంచి జయగారితో, బీఏ రాజుతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రచయిత్రిగా, పత్రిక ఎడిటర్గా, దర్శకురాలిగా.. ఇలా అన్ని శాఖల మీద మంచి పట్టున్న గొప్ప సాంకేతిక నిపుణురాలు లేకపోవడం పరిశ్రమకు తీరని లోటు. బీఏ రాజు ఒక మాట అన్నారు.. ‘చనిపోయింది తను కాదు, నేను. నా ఆలోచనల్లో, ఊహల్లో జయ బ్రతికే ఉంది. తను లేకపోతే నేను లేను’ అన్నారు. బాధ అనిపించింది. – నటుడు చిరంజీవి జయ చనిపోవడం బాధగా ఉంది. తను డైరెక్టర్ అవ్వకముందు జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచీ నాకు తెలుసు. వెరీ హానెస్ట్, ఫ్రాంక్ పర్సన్. ఏ ఇంటర్వ్యూ తీసుకున్నా చాలా బాగా తీసుకునేది. డైరెక్టర్గా సక్సెస్ఫుల్ సినిమాలు తీశారు. – నటుడు వెంకటేశ్ జయగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు పరిశ్రమలోని మహిళా దర్శకుల్లో సావిత్రిగారు, విజయనిర్మలగారి తర్వాత జయగారే. ఆమె 6 సినిమాలు డైరెక్ట్ చేసి హిట్ కొట్టారు. ఆమె రాసిన ‘ఆనందోబ్రహ్మ’ 14 భాషల్లో అనువాదమైంది. ఆవిడలోని మానవీయ కోణం చాలా గొప్పది. – నటుడు–దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి జయగారికి, నాకు ఉన్న అనుబంధం ఏంటంటే మా ఇద్దరి బర్త్డే ఒకే రోజు (జనవరి 11). ఆవిడ ‘హ్యాపీ బర్త్డే అంటే నేను సేమ్ టు యు’ అనేవాణ్ని. నేను ‘హ్యాపీ బర్త్డే అంటే ఆవిడ సేమ్ టు యు’ అనేవారు. నా సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా ఫోన్ చేసి విశ్లేషిస్తూ మాట్లాడేవారు. – దర్శకుడు సుకుమార్ ఎప్పుడో ఇంకా 30 ఏళ్ల తర్వాత వినాల్సిన వార్త ఇంత తొందరగా వినడం చాలా బాధ అనిపించింది. జయ తపన ఉన్న డైరెక్టర్. తను చాలా సక్సెస్ఫుల్ సినిమాలు చేశారు. ఇండస్ట్రీ దురదృష్టం ఏంటంటే మొన్న హరికృష్ణగారు చనిపోయారు.. ఇప్పుడు జయగారు. బాధ తర్వాత బాధ. – దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి విజయనిర్మలగారి తర్వాత ఆమె వారసత్వాన్ని జయగారు కొనసాగిస్తూ ఎంతో మంది మహిళా దర్శకులు రావడానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ చాలా స్ఫూర్తి ఇచ్చారు. అలాంటి జయగారు మన మధ్య లేకపోవడం గొప్ప లోటు. క్రాంతికుమార్గారి వద్ద నేను అసిస్టెంట్గా చేస్తున్నప్పుడు తను కలిదిండి జయ పేరుతో కథలు, పుస్తకాలు రాసేవారు. అవి ఆయనకు బాగా నచ్చేవి. అప్పుడే ఆమె అంటే నాకు అభిమానం ఏర్పడింది. – దర్శకుడు గుణశేఖర్ బలమైన వ్యక్తిత్వం ఉన్నవారు జయగారు. ఆమెతో మాది 30 ఏళ్ల అనుబంధం. పరిశ్రమ పట్ల పూర్తి అవగాహన ఉన్న గొప్ప టెక్నీషియన్. విజయనిర్మలగారి తర్వాత ఆ స్థాయిలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కుతారేమో అనేంత పట్టుదల ఉన్న జయగారు సడెన్గా ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధాకరం. రాజుగారికి తీరని లోటు ఇది. – నిర్మాత అచ్చిరెడ్డి జయగారు నా సినిమాలు చూసి ఎప్పటికప్పుడు అభినందించేవారు.. చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు. నువ్వు మంచి సినిమాలు తీస్తున్నావు.. ఇంకా మంచి సినిమాలు తీయాలి అంటూ ప్రోత్సహించేవారు. చాలా ఫ్రెండ్లీ నేచర్. – డైరెక్టర్ నందినీరెడ్డి జయ మేడమ్కి ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువ. రోజూ వాకింగ్ చేస్తారు, ఫ్రూట్స్ తింటారు. నాకు ఆవిడ తల్లిలాంటిది. నా ఫస్ట్ సినిమా ‘చంటిగాడు’ డైరెక్టర్ ఆవిడ. ఆ చిత్రం టైమ్లో నేను చాలా చిన్నమ్మాయిని. నన్ను కూతురిలా చూసుకున్నారు. – నటి సుహాసిని జయగారు ‘లవ్లీ’ సినిమాతో నాకు మంచి హిట్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి, మంచి సినిమాలు చేయాలి, హిట్ కొట్టాలని ఎంకరేజ్ చేసేవారు. – నటుడు ఆది హరికృష్ణను చివరిసారి చూడాలనుకున్నారు కొద్ది రోజులుగా హాస్పిటల్లో ఉంటున్న జయ బుధవారం హరికృష్ణ మరణ వార్త విని షాకయ్యారు. ఆయన్ను కడసారి చూడాలనుకున్నారు. ఆమె తెరకెక్కించిన ‘చంటిగాడు’ చిత్రం ఓపెనింగ్కి గెస్ట్గా హరికృష్ణ వచ్చారు. ‘‘వేడుక 9 గంటలకు అంటే ఆయన 8.30కి వచ్చారు. ఎంతో ఆప్యాయంగా మాట్లాడి, సినిమా సక్సెస్ కావాలని అభినందించారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించాలనుకున్నారు జయ. అయితే ఆరోగ్య సమస్యల రీత్యా కొన్ని రోజుల తర్వాత కుటుంబాన్ని పరామర్శిద్దాం అనుకునే లోపే ఆమె మృతి చెందడం విచారకరం’’ అని బీఏ రాజు ఉద్వేగానికి గురయ్యారు. బీఏ రాజు, చిరంజీవి, వెంకటేశ్, మహేశ్బాబు... -
దర్శకురాలు బి.జయ పార్థివ దేహానికి ప్రముఖుల నివాళి
-
జయకు సినీ ప్రముఖులు నివాళి
నందమూరి హరికృష్ణ మరణవార్తను జీర్ణించుకోక ముందే టాలీవుడ్ కు మరో షాక్ తగిలింది. జర్నలిస్ట్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, దర్శకత్వం వైపు అడుగులు వేసి చంటిగాడు సినిమా ద్వారా దర్శకురాలిగా తన ప్రతిభను నిరూపించుకున్న బి జయ గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ కు గురైంది. బి జయ మరణవార్త తెలుసుకున్న మహేష్ బాబు.. ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. -
జయకు మహేష్ బాబు నివాళి
హైదరాబాద్: నందమూరి హరికృష్ణ మరణవార్తను జీర్ణించుకోక ముందే టాలీవుడ్ కు మరో షాక్ తగిలింది. జర్నలిస్ట్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, దర్శకత్వం వైపు అడుగులు వేసి చంటిగాడు సినిమా ద్వారా దర్శకురాలిగా తన ప్రతిభను నిరూపించుకున్న బి జయ గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ కు గురైంది. బి జయ మరణవార్త తెలుసుకున్న మహేష్ బాబు.. ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. జయ మరణం టాలీవుడ్ కు తీరని లోటని, జయలాంటి దర్శకురాలు టాలీవుడ్ కు అరుదుగా దొరుకుతుంటారని మహేష్ బాబు అన్నారు. బీఏ రాజు కుటుంబానికి మహేష్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మహేష్తో పాటు సీనియర్ హీరో వెంకటేష్, మంచు మనోజ్, ఆది, ఛార్మి, ఎస్వీ కృష్ణారెడ్డి, వంశీ పైడిపల్లి, గుణశేఖర్ తదితరులు ఆమెకు నివాళులు అర్పించారు. జయ ఆకస్మిక మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. దీనిలో భాగంగా జయతో తమకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. టాలీవుడ్ దర్శకురాలు మృతి (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టాలీవుడ్ దర్శకురాలు మృతి
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినీ దర్శకురాలు, డైనమిక్ లేడీ బి.జయ(54) గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జయ ప్రముఖ పీఆర్వో బీఏ రాజు సతీమణి. జర్నలిస్ట్గా కెరీర్ ప్రారంభించిన ఆమె సూపర్ హిట్ అనే సినీవారపత్రికకు జనరల్ మేనేజర్గా పనిచేశారు. అనంతరం చంటిగాడు సినిమా ద్వారా దర్శకురాలిగా మారారు. ఆమె తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం రావులపాలెంలో జన్మించారు. తెలుగు సినీ పరిశ్రమలో తనకో ప్రత్యేకతను సంపాదించుకున్నారు. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారు. ’వైశాఖం’చిత్రంతో ప్రేక్షకుల ప్రశంసలతోపాటు సిల్వర్ క్రౌన్ అవార్డ్ను అందుకున్నారు.
Related News by category
-
ఓటేసేందుకు అమెరికా నుంచి వచ్చిన స్టార్ హీరో కూతురు
ఏప్రిల్ 26న కర్ణాటకలో రెండో దశ ఎన్నికలు జరిగాయి. సామాన్య ప్రజలతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొని తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా ప్రజలు తమ గ్రామాలకు చేరుకుని ఓటు వేశారు. ఈ కోవలో కన్నడ టాప్ హీరో దునియా విజయ్ కూతురు మోనిషా కూడా ఉన్నారు.ఇదిలా ఉంటే దునియా విజయ్ కూతురు మోనిషా అమెరికాలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చదువుతుంది. ఏప్రిల్ 26న ఎన్నికలు ఉండటంతో తన ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు ఆమెరికా నుంచి బెంగళూరుకు చేరుకుంది. తండ్రి మాదిరి మోనిషా కూడా సినిమా రంగంలో రాణించాలని కోరుకుంటుంది. ఈ విషయంపై ఆమె ఇలా చెప్పింది. 'నేనూ, మా చెల్లి మోనికా ఇద్దరమూ సినిమా రంగంపై ఆసక్తి చూపుతున్నాం. నాన్నకు మొదట నచ్చలేదు. సినిమాల్లోకి వద్దని ఆయన చెప్పారు. కానీ, నా సీరియస్నెస్ చూసి ఒప్పుకున్నారు.సినిమా ఇండస్ట్రీకి వస్తే సరైన శిక్షణ తీసుకోవాలని నాన్న గారు సూచించారు. నటనతో పాటు సినిమాల్లోని వివిధ దశలు, సాంకేతికత, మీడియాను ఎలా ఎదుర్కోవాలి, నన్ను నేను ఎలా రక్షించుకోవాలి.. ఇలా అన్నీ సరిగ్గా నేర్చుకుని రావాలని నాన్న సూచించారు. దీంతో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నన్ను చేర్పించారు. ప్రస్తుతం అక్కడే చదువుకుంటున్నాను. కోర్సు పూర్తయ్యాక శాండల్ వుడ్కి తప్పకుండా వస్తాను.' అని చెప్పింది మోనిషా.బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు దునియా విజయ్. కన్నడలో ఎన్నో సినిమాలు చేసిన ఆయనకు తెలుగులో ఇదే మొదటి చిత్రం. ప్రస్తుతం ఆయన గోపీచంద్ చిత్రంలో నటిస్తున్నాడు. -
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్లో ఇతడిని ప్రత్యేక దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. అంతకుముందు సాహిల్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ని బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఈ బెట్టింగ్ కేసు ఏంటి? సాహిల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? బాలీవుడ్ నటుడిగా సాహిల్ ఖాన్ పరిచయమే. 'స్టైల్', 'ఎక్స్యూజ్ మీ' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఫిట్నెస్ ట్రైనర్, ఇన్ఫ్లూయెన్సర్గా చేస్తున్నాడు. కొన్నేళ్ల ముందు మహేదేవ్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశాడు. అయితే ఈ యాప్ ద్వారా రూ.15,000 కోట్ల అవినీతి జరిగింది. దాదాపు 67 బెట్టింగ్ సైట్లు సృష్టించారు. ఈ విషయమై సామాజిక కార్యకర్త ప్రకాశ్ బంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2023 నవంబరులో మాతుంగ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా డిసెంబరులో దీన్ని ప్రమోట్ చేస్తున్న సాహిల్ ఖాన్కి నోటీసులు జారీ చేశారు.(ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్)అయితే విచారణకు హాజరు కాకుండా సాహిల్.. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టుని ఆశ్రయించాడు. సెలబ్రిటీగా తాను కేవలం ప్రమోట్ చేశానని చెప్పుకొచ్చాడు. యాప్లో జరిగే వాటితో తనకు సంబంధం లేదని పేర్కొన్నాడు. కానీ పోలీసులు మాత్రమే ఇతడిని బెట్టింగ్ యాప్ కో-ఓనర్ అని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు.అయితే ఈ బెట్టింగ్ యాప్ ద్వారా అవినీతి జరిగిన డబ్బంతా కూడా హవాలా ద్వారా విదేశాలకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. సాహిల్తో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలని కూడా పోలీసులు ఈ కేసులో విచారించే అవకాశాలు ఉన్నాయి.(ఇదీ చదవండి: ప్రముఖ దేవాలయంలో స్టార్ హీరోయిన్ సంయుక్త.. కారణం అదేనా?) -
నేను వాటితో నటించాలంటే కాస్త రెమ్యునరేషన్ పెంచాల్సిందే: ట్రెండింగ్ హీరోయిన్
టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ నటించిన చిత్రం 'ప్రసన్న వదనం'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అర్జున్ వైకే దర్శకత్వం వహించిన ఈ మూవీలో సుహాస్కు జోడీగా కన్నడ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ ఎంట్రీ ఇచ్చింది. ట్రైలర్లో ఈ బ్యూటీని చూసిన వారందరూ ఫిదా అవుతున్నారు. దీంతో మే 3న విడుదల కానున్న ప్రసన్న వదనం చిత్రం కోసం ప్రేక్షకులు మరింత ఈగర్గా ఎదురుచూస్తున్నారు.మంగళూరులో పుట్టిన పాయల్ రాధాకృష్ణ మోడల్గా ఎంట్రీ ఇచ్చి ఆపై 'బెంగళూరు అండర్ వరల్డ్' సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. బెంగళూరులో ఇంజినీరింగ్ చేరిన పాయల్ మొదటి సంవత్సరంలోనే చదువు ఆపేసి మోడలింగ్ వైపు అడుగులు వేసింది. అనంతరం అమెజాన్, సఫోలా వంటి ప్రముఖ బ్రాండ్ల కోసం ఆమె పనిచేసింది. తల్లిదండ్రులకు ఇష్టం లేకున్నా యాక్టింగ్లో డిప్లొమా చేసిన ఈ బ్యూటీ 19 ఏళ్లకే సినిమా అవకాశాలపై కన్నేసింది. తల్లి క్లాసికల్ డ్యాన్సర్ కావడంతో పాయల్ రాధాకృష్ణ కూడా మంచి ట్రెడిషినల్ డ్సాన్సర్. ఆమె అమ్మగారు డ్యాన్స్ అకాడమీని కూడా రన్ చేస్తున్నారు.మిగతా హీరోయిన్లకు భిన్నంగా తన ఆలోచనలు ఉన్న పాయలకు పెంపుడు జంతువులు అంటే ఏ మాత్రం ఇష్టం లేదట. ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు ఎక్కువగా కుక్కలు,పిల్లులు పెంచుకుంటూ ఉంటారు. కానీ ఈ కన్నడ బ్యూటీకి పెట్స్ అంటే ఏమాత్రం ఇష్టం లేదని చెప్పింది. తనకు సంబంధించిన యాడ్స్ , సినిమాల్లో పెంపుడు జంతువులతో ఏదైనా సీన్ చేయాలంటే అందుకు రెమ్యునరేషన్ ఎక్కువగా అడుగుతానని ఈ బ్యూటీ చెప్పుకొస్తుంది.సినిమా ఇండస్ట్రీలో మొదట్లో తనకు తెలుగు భాష అంటే కాస్త ఇబ్బందిగా ఉండేదని చెప్పింది. పలు యాడ్లు చేస్తున్నప్పుడు తను తెలుగు మాట్లాడుతుంటే కొందరు కామెంట్లు కూడా చేశారని చెప్పుకొచ్చింది. దీంతో కష్టపడి తెలుగు నేర్చుకున్నానని ఆమె తెలిపింది. టాలీవుడ్లో అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబుతో ఒక సినిమాలో అయినా నటించాలనేది తన కోరిక అంటూ తెలిపింది. కోలీవుడ్లో అయితే ధనుష్తో నటించాలని ఉందని పేర్కొంది. ప్రసన్న వదనం చిత్రంతో పాటు 'చారీ పాఠం' అనే మరో సినిమాలోనూ పాయల్ రాధాకృష్ణ నటిస్తోంది. View this post on Instagram A post shared by Payal Radhakrishna Shenoy (@payal_radhakrishna) -
Nidhi Bhist: మెయిన్ రోల్స్.. ప్చ్.. కష్టమే..! కానీ ఇప్పుడు నిధి ద బెస్ట్!!
‘జాబ్ కన్నా యాక్టింగ్ మీద ప్యాషన్ ఉన్నట్టుంది. షారూఖ్ ఖాన్తో కలసి స్క్రీన్ మీద కనిపిస్తావన్నమాట’ అంటూ బాస్ ఎగతాళి చేశాడు. ‘గుండ్రటి మొహం.. అక్క, వదిన, పిన్ని పాత్రలకైతే పనికొస్తావ్. మెయిన్ రోల్స్.. ప్చ్.. కష్టమే!’ అని బాలీవుడ్ రిజెక్ట్ చేసింది. ఆమె ఇప్పుడు వండర్ఫుల్ యాక్ట్రెస్, రైటర్ అండ్ డైరెక్టర్గా సినిమా ప్రేక్షకుల, వెబ్ వీక్షకుల మన్ననలందుకుంటోంది. అన్నట్టు షారూఖ్ ఖాన్తోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ బహుముఖ ప్రజ్ఞ పేరు.. నిధి బిష్ట్! ► ఢిల్లీలో పుట్టి, పెరిగింది. అమ్మ.. టీచర్. నాన్న.. ఐపీఎస్ ఆఫీసర్. ఆ ఇద్దరూ తమ కూతురు డాక్టర్ కావాలని కలలు కన్నారు. వాళ్ల కోరిక మేరకు ఇంటర్లో బైపీసీలో జాయిన్ అయింది నిధి. కానీ రెండు రోజులకే అది తన నోట్స్ ఆఫ్ స్టడీ కాదనుకుంది. దాంతో కామర్స్ గ్రూప్కి మారింది. అదీ తనకు సరిపడదని గ్రహించి ఆ వెంటనే హ్యుమానిటీస్లోకి వెళ్లి సెట్ అయింది.► ఇంటర్ తర్వాత .. జామియా మిలియా యూనివర్సిటీలో లా చేసింది. అక్కడ థియేటర్ వింగ్ ఇప్టా (ఇండియన్ పీపుల్ థియేటర్ అసోసియేషన్) చాలా యాక్టివ్. చిన్నప్పటి నుంచీ నిధికి నటనంటే ప్రాణం. అందుకే ‘లా’ కోసం ఆ యూనివర్సిటీని ఎంచుకుంది. తన అయిదేళ్ల లా కోర్స్లో ఇప్టాతోనే ఎక్కువ గడపింది నాటకాలు రాస్తూ.. వేస్తూ! ఆ ఆసక్తి, ఉత్సాహంతోనే లా అయిపోగానే పుణె వెళ్లింది అక్కడి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవడానికి. కానీ అందులో సీట్ రాలేదు. నిరాశతో మళ్లీ ఢిల్లీకి వచ్చేసి ఒక లా ఫర్మ్లో చేరింది.► ఉద్యోగం చేస్తున్నప్పుడే ఒక నాటకంలో నటించే అవకాశం వచ్చింది నిధికి. ఉదయం 9 కల్లా ఆఫీస్కి చేరి.. అక్కడి నుంచి కోర్ట్.. మళ్లీ ఆఫీస్ అలా రాత్రి 9 వరకు పని చూసుకుని.. అక్కడి నుంచి నేరుగా థియేటర్ రిహార్సల్స్కి వెళ్లేదట. ఉదయం మూడు గంటల వరకు రిహార్సల్స్ చూసుకుని ఇల్లు చేరేది. అలా కొన్ని నెలల శ్రమానంతరం స్టేజ్ మీద నాటకం ప్రదర్శించే రోజు రానేవచ్చింది. నిధి తన బాస్నూ ఆహ్వానించింది. అతను ఆ రోజు చప్పట్లతో ఆమె ప్రతిభను ప్రశంసించాడు. కానీ మరుసటి రోజు ఆఫీస్లో పది పనులు చెప్పి .. సాయంకాలానికి డెడ్లైన్ ఇచ్చాడు. చేయలేకపోయింది నిధి. అప్పుడే ‘షారూఖ్ ఖాన్తో కలసి కనిపిస్తావన్నమాట’ అంటూ ఆ బాస్ కామెంట్ చేశాడు. ‘తప్పకుండా కనిపిస్తాను చూడండీ..’ అంటూ ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చింది నిధి.► యాక్టింగ్ మీదే పూర్తి దృష్టి పెట్టాలని ముంబై చేరింది. కనీస అవసరాల కోసం p్చnజ్ఛ్చ3 అనే లీగల్ ఔట్సోర్సింగ్ సంస్థలో చేరింది. జాబ్.. ఆడిషన్సే లోకమయ్యాయి ఆమెకు. అయితే ఎక్కడికి వెళ్లినా రిజెక్షనే ఎదురైంది. అయినా అధైర్యపడలేదు. తన ఫిక్స్డ్ డిపాజిట్ని బ్రేక్ చేసి ‘న్యూ బ్రెయిన్ థియేటర్ వోక్స్’ అనే బ్యానర్ని స్థాపించి ‘హూ లెట్ ద డాగ్స్ అవుట్’ అనే నాటకాన్ని డైరెక్ట్ చేసింది. అది చూసి యూట్యూబ్ చానెల్ ‘టీవీఎఫ్ (ద వైరల్ ఫీవర్ ) వీడియోస్’ ఫౌండర్ అరునాబ్ కుమార్ టీవీఎఫ్లో అవకాశం ఇచ్చాడు. అందులో ఆమె స్క్రిప్ట్ రైటర్గా, యాక్టర్గా, కాస్టింగ్ డైరెక్టర్గా మల్టిపుల్ రోల్స్ని పోషించింది. ఆ టాలెంట్ ఆమెకు ఇటు ఓటీటీ.. అటు సినిమాల్లో ఎన్నో అవకాశాలను తెచ్చిపెట్టింది. దేశమంతటా అభిమానాన్ని సంపాదించిపెట్టింది.► క్రియెటివిటీకి బెంచ్ మార్క్ ఉండదనే కాన్ఫిడెన్స్ నాది. కాబట్టే ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా లైట్ తీసుకున్నా. వచ్చిన అవకాశంతో నేనేంటో నిరూపించుకున్నా! అందుకే ఆ రోజు రిజెక్ట్ చేసినవాళ్లే ఈ రోజు నాతో పనిచేయడానికి డేట్స్ అడుగుతున్నారు!‘తుప్పాకీ’, ‘చాయ్ సుట్టా క్రానికల్స్’, ‘పర్మినెంట్ రూమ్మేట్స్’, ‘టీవీఎఫ్ పిచర్స్’, ‘ఉమ్రీకా’, ‘టీవీఎఫ్ ట్రిప్లింగ్’, ‘ఫిల్లోరి’, ‘బిష్ట్.. ప్లీజ్’, ‘పిఏ గాళ్స్’, ‘డ్రీమ్ గర్ల్’, ‘క్యూబికల్స్’, ‘మిస్టర్ అండ్ మిసెస్’, ç‘ßోమ్ శాంతి’, ‘ఫోన్ బూత్’. ‘మామ్లా లీగల్ హై’ వంటి షోస్, సినిమాస్, సిరీస్కి కాస్టింగ్ డైరెక్టర్, రైటర్, డెరెక్టర్, యాక్టర్గా పనిచేసింది. టీవీఎఫ్లోనే.. షారూఖ్ ఖాన్ పాల్గొన్న ‘బేర్లీ స్పీకింగ్ విత్ అర్నబ్’ అనే షోకి నిధి మోడరేటర్గా వ్యవహరించి.. తన బాస్కి చెప్పినట్టు షారూఖ్ ఖాన్తో స్క్రీన్ కూడా షేర్ చేసుకుంది. – నిధి బిష్ట్.ఇవి చదవండి: Cover Story: 'స్వేదవేదం'! చెమటచుక్కకు దక్కుతున్నదెంత? -
కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
మరో కమెడియన్ సొంతిల్లు కట్టుకున్నాడు. 'పటాస్' షోతో గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత పలు కామెడీ షోలతో గుర్తింపు తెచ్చుకున్న గల్లీ బాయ్ భాస్కర్ తాజాగా కొత్త ఇంట్లో అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఫైనల్లీ డ్రీమ్ హౌస్ కట్టుకున్నానని ఇన్ స్టాలో రాసుకొచ్చాడు. ఈ కార్యక్రమానికి తోటి కమెడియన్స్ వచ్చి విషెస్ చెప్పారు.(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?)'పటాస్' షోలో స్టాండప్ కమెడియన్గా కెరీర్ ప్రారంభించిన భాస్కర్.. సద్దాం, యాదమ్మ రాజు తదితరులతో కలిసి స్కిట్స్ కూడా చేసేవాడు. ఆ తర్వాత అదిరింది, కామెడీ స్టార్స్, కామెడీ స్టాక్ ఎక్సేంజ్ లాంటి షోలు చేశాడు. ఇప్పుడు 'జబర్దస్త్'లో చేస్తున్నాడు. వీటితో పాటు ఈవెంట్స్ లో పాల్గొంటూ రెండు చేతులా సంపాదిస్తున్న భాస్కర్.. ఇప్పుడు మూడు అంతస్థుల ఇల్లు కట్టేసుకున్నారు. ఈ వీడియోని పోస్ట్ చేస్తూ.. తన డ్రీమ్ హౌస్ కట్టుకున్నానని ఎమోషనల్ అయ్యాడు.(ఇదీ చదవండి: ప్రముఖ దేవాలయంలో స్టార్ హీరోయిన్ సంయుక్త.. కారణం అదేనా?) View this post on Instagram A post shared by Bhaskar (@gully_boy_bhaskar)
Advertisement
Photos
View allVideo
View allదిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement