రెండు రోజులుగా హీరో శ్రీకాంత్కు యాక్సిడెంట్ అంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ లైక్స్ కోసం, సబ్స్ క్రైబ్స్ కోసం ఇలా దిగజారుతారా అంటూ మండిపడ్డాడు. ‘నేను బెంగళూరు షూటింగ్ లో ఉండగా నిన్న ఉదయం నుంచి మీకు యాక్సిడెంట్ అయ్యిందట కదా ఎలా ఉంది అంటూ ఫోన్స్ కాల్స్ రావడం మొదలయ్యాయి.. హైదరాబాద్ లో ఉన్న నా కుటుంబ సభ్యులకు కూడా ఈ విషయం తెలిసి కంగారుపడి ఫోన్ చేశారు. అలాగే అభిమానులు కూడా ఆందోళనతో ఫోన్ చేశారు.
ఇలా అసత్య ప్రచారాలతో వీడియోలు చేసి మీ లైక్స్ కోసం, రేటింగ్స్ కోసం వెబ్ సైట్ లో ఇలాంటి వార్తలు పెట్టడం చాలా తప్పు, ఇలాంటి వారి పై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుంది.. అలాగే ఇక ముందు ఎవరూ ఇలాంటి అసత్య వార్తలు రాయొద్దు. ఎవరో ఓ వ్యక్తి తప్పు చేస్తే దాన్ని తీసుకొని మరికొన్ని వెబ్సైట్స్, యూట్యూబ్ చానెల్స్, పేపర్స్ లో అవే వార్తలు వస్తున్నాయి. ఇది పెద్ద తప్పు.. ఈ విషయం పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా సీరియస్ గా తీసుకుంటుంది.. అలాగే ఈ అసత్య ప్రచారం జరిపిన వారిపై సైబర్ క్రైం ఎస్పీ రామ్మోహన్ రావు గారికి ‘మా’ ద్వారా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింద’ని శ్రీకాంత్ తెలిపారు.