Sakshi News home page

అందరికోసం మేము

Published Thu, Nov 12 2015 10:57 PM

అందరికోసం మేము

చిన్నపిల్లల మనోభావాలు, మానసిక సంఘర్షణల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘పసంగ 2’. పాండిరాజా దర్శకత్వంలో తమిళంలో హీరో సూర్య నటిస్తూ నిర్మించిన చిత్రమిది. సూర్య, కె.ఇ. జ్ఞానవేల్ రాజా సమర్పణలో ఈ చిత్రాన్ని ‘మేము’ పేరుతో జూలకంటి మధుసూదన్‌రెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. సూర్య మాట్లాడుతూ - ‘‘మా సంస్థలో తొలి చిత్రంగా ‘36 వయదినిలే’ తీశాం.

ఆ తరువాత వస్తున్న చిత్రం ‘మేము’. పాండిరాజ్ ఈ సినిమా కోసం చాలా పరిశోధన చేశారు. పిల్లల కథాంశమైనా కూడా అందరికీ నచ్చే విధంగా తీశాం’’ అన్నారు. ఈ వేడుకలో అమలాపాల్, కె.ఇ. జ్ఞానవేల్ రాజా, దర్శకుడు పాండిరాజ్, సంగీత దర్శకుడు అర్రోల్ కొరెల్లి, మాచర్ల ఎమ్మెల్యే పి. రామకృష్ణారెడ్డి, శివకృష్ణ, నిర్మాతలు తమటం కుమార్‌రెడ్డి, ప్రసాద్ సన్నితి, కేవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement