-
సూర్య సినిమా విడుదల వాయిదా
సూర్య ప్రధాన పాత్రలో తన సొంతం నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కిన సినిమా 'మేము'. తమిళ్లో గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు వర్షన్ రిలీజ్కు మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముందుగా తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా, సంక్రాంతికి టాలీవుడ్లో భారీ పోటి ఉండటంతో వాయిదా వేసుకున్నారు. తరువాత కూడా పలుమార్లు సినిమా రిలీజ్ చేయాలని ప్రయత్నించినా, వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఈ శుక్రవారం(మార్చి 18) ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించారు చిత్రయూనిట్. అయితే మరోసారి మేము సినిమాను వాయిదా వేయక తప్పలేదు. వాయిదాకు కారణాలేంటి అన్న విషయం వెల్లడించకపోయినా, మేము చిత్రం శుక్రవారం రిలీజ్ కావటం లేదని ప్రకటించారు. త్వరలో రిలీజ్ డేట్ వెల్లడిస్తామని తెలిపారు చిత్రయూనిట్. పసంగ సినిమాకు సీక్వల్గా పసంగ 2 పేరుతో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో మేము పేరుతో రిలీజ్ చేస్తున్నారు. సూర్య సరసన అమలా పాల్ హీరోయిన్గా నటిస్తుండగా తెలుగమ్మాయి బిందు మాధవి మరో ప్రధాన పాత్రలో నటిస్తోంది. చిన్న పిల్లలను ఆకట్టుకునే కథాంశంతో సందేశాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకుడు. -
ఆ డైరెక్టర్ రెండు సినిమాలు ఒకేరోజు
సినీరంగంలో తమ సినిమాతో తామే పోటీ పడటానికి తారలు ఇష్టపడరు. హీరోయిన్ల విషయంలో ఇలా ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం అప్పుడప్పుడు ఉంటుంది. కానీ, హీరోలు, సాంకేతిక నిపుణుల విషయంలో మాత్రం చాలా అరుదు. చాలా ఏళ్ల కిందట బాలకృష్ణ హీరోగా నటించిన బంగారు బుల్లోడు, నిప్పురవ్వ సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యి రికార్డ్ సృష్టించాయి. కృష్ణ హీరోగా నటించిన సినిమాలు కూడా పలు సందర్భాల్లో తక్కువ గ్యాప్లో రిలీజ్ అయ్యాయి. కానీ ఒకే దర్శకుడు తెరకెక్కించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అవ్వడం అత్యంత అరుదు. అలాంటి అరుదైన రిలీజ్ ఈ శుక్రవారం జరగనుంది. తమిళ దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన కథాకళి, మేము సినిమాలు ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన పసంగ 2 సినిమా.. మేము పేరుతో తెలుగులో రిలీజ్ అవుతోంది. తమిళంలో గత ఏడాది డిసెంబర్లోనే రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో మాత్రం ఆలస్యంగా ఈ వారం రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో పాటు ఇదే దర్శకుడి, డైరెక్షన్లో తెరకెక్కిన కథాకళి సినిమా కూడా తమిళ్లో జనవరిలోనే రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను కూడా తెలుగులో ఈ శుక్రవారమే రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. అలా ఒకే దర్శకుడి రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వటం టాలీవుడ్ సరికొత్త రికార్డ్. -
'మేము' రిలీజ్ పై డైలమా
కోలీవుడ్లో స్టార్ హీరోగా మంచి ఫాంలో ఉన్న సూర్య నిర్మాతగాను మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే జ్యోతిక లీడ్ రోల్లో 36 వయోధినిలే సినిమాను తెరకెక్కించిన సూర్య, మరో సందేశాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. జాతీయ అవార్డు గెలిచిన దర్శకుడు పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన పసంగ 2 సినిమాను 'మేము' పేరుతో తెలుగు లోనూ రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. చాలా కాలం క్రితమే అన్నికార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా, రిలీజ్ విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు సూర్య. డిసెంబర్ తొలి వారంలోనే రిలీజ్ ప్లాన్ చేసినా ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవటంతో వాయిదా పడింది. ఆ తరువాత క్రిస్టమస్ బరిలో నిలపాలని భావించినా, తెలుగులో మూడు సినిమాల రిలీజ్ ఉండటంతో వాయిదా వేశారు. జనవరిలో కూడా వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ఇక చేసేదేమి లేక జనవరి నెలాఖరున మేము సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్య నిర్మిస్తున్న ఈ సినిమాలో, తనూ ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. దాదాపు 40 నిమిషాల పాటు సూర్య ఈ సినిమాలో కనిపించనున్నాడు. అమలాపాల్, బిందు మాధవి ఇతర లీడ్ రోల్స్లో నటిస్తున్న ఈ సినిమా కథ మానసిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల చుట్టూ తిరుగుతోంది. తమిళంలో ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. -
‘మనం’, ‘దృశ్యం’ తరహాలో...
సినిమా సినిమాకు విభిన్న తరహా పాత్రలు పోషించి, ప్రేక్షకులను ఆకట్టుకునే కథానాయకుడు సూర్య. అందుకే ఆయనకు తమిళంతో పాటు తెలుగులోనూ అభిమానులున్నారు. సూర్య హీరోగా నటిస్తూ పాండిరాజ్ దర్శకత్వంలో తమిళంలో నిర్మించిన చిత్రం - ‘పసంగ 2’. ఈ చిత్రాన్ని సాయి సూర్య, కె.ఇ. జ్ఞానవేల్ రాజా సమర్పణలో మణికంఠ పిక్చర్స్ పతాకంపై జూలకంటి మధుసూదన్ రెడ్డి తెలుగులో ‘మేము’ పేరుతో అనువదిస్తున్నారు. ఈ నెలాఖరున ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఇటీవల సూర్య విడుదల చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘మనం’, ‘దృశ్యం’ సినిమాల తరహాలో మా చిత్రం ఘన విజయం సాధిస్తుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ‘పిశాచి’ చిత్ర ఫేమ్ అరోల్ కొరెల్లి, పాటలు: వెన్నెలకంటి, చంద్రబోస్, సాహితి, సహ నిర్మాతలు: ప్రసాద్ సన్నితి, తమటం కుమార్రెడ్డి. -
అందరికోసం మేము
చిన్నపిల్లల మనోభావాలు, మానసిక సంఘర్షణల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘పసంగ 2’. పాండిరాజా దర్శకత్వంలో తమిళంలో హీరో సూర్య నటిస్తూ నిర్మించిన చిత్రమిది. సూర్య, కె.ఇ. జ్ఞానవేల్ రాజా సమర్పణలో ఈ చిత్రాన్ని ‘మేము’ పేరుతో జూలకంటి మధుసూదన్రెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం పాటలను హైదరాబాద్లో విడుదల చేశారు. సూర్య మాట్లాడుతూ - ‘‘మా సంస్థలో తొలి చిత్రంగా ‘36 వయదినిలే’ తీశాం. ఆ తరువాత వస్తున్న చిత్రం ‘మేము’. పాండిరాజ్ ఈ సినిమా కోసం చాలా పరిశోధన చేశారు. పిల్లల కథాంశమైనా కూడా అందరికీ నచ్చే విధంగా తీశాం’’ అన్నారు. ఈ వేడుకలో అమలాపాల్, కె.ఇ. జ్ఞానవేల్ రాజా, దర్శకుడు పాండిరాజ్, సంగీత దర్శకుడు అర్రోల్ కొరెల్లి, మాచర్ల ఎమ్మెల్యే పి. రామకృష్ణారెడ్డి, శివకృష్ణ, నిర్మాతలు తమటం కుమార్రెడ్డి, ప్రసాద్ సన్నితి, కేవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
Advertisement