న్యూఢిల్లీ: అత్యవసర వైద్య సదుపాయాలు కల్పించడంలోనూ ఢిల్లీ మెట్రో ప్రయాణికుల నుంచి ప్రశంసలందుకుంటోంది. రోజుకు ప్రయాణించే లక్షలాదిమందిలో ఏదో ఒక రైళ్లో, ఎప్పుడో ఒకప్పుడు అస్వస్థతకు గురవుతూనే ఉంటారు. వీరిలో కొందరికి గుండెనొప్పి, కడుపునొప్పి, తీవ్రమైన తలనొప్పి, హైపర్టెన్షన్ వంటి ప్రాణాంతక సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే ఇటువంటివారిని గుర్తించి, వారికి ముందుగా అవసరమైన ప్రథమ చికిత్స చేసి, వెనువెంటనే ఆస్పత్రికి తరలించాల్సి ఉంటుంది. ఈ బాధ్యతలను మెట్రో సిబ్బంది చాలా సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. 2012 నుంచి ఇప్పటిదాకా 1,850 మంది ప్రాణాలను కాపాడారు.
సంబంధిత అధికారి ఒకరు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రయాణికుల్లో ఎవరికి అత్యవసర వైద్య సేవలు అవసరమో ముందుగా గుర్తించాలి. గుర్తించినవారికి ముందుగా ప్రథమ చికిత్సనందించి, ఆస్పత్రికి తరలించాలి. ఇందుకోసం డీఎంఆర్సీ ప్రత్యేకంగా ప్రతి స్టేషన్లో కొంతమందిని నియమించింది. విధుల్లో చేరేముందే వారంరోజులపాటు సిబ్బందికి ప్రత్యేక శిక్షణనిచ్చాం. ఫలితంగా రెండేళ్లలో 100 హృద్రోగుల ప్రాణాలను కాపాడారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయే అత్యవసర పరిస్థితి నుంచి వారిని గట్టెక్కించాం. ఇక ఛాతీనొప్పి, కడుపునొప్పి, పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్న 340 మందికి ప్రథమచికిత్సనందించి, సమీపంలోని ఆస్పత్రులకు తరలించాం.
వికారంతో తీవ్ర అస్వస్థతకు గురైన 105 మందిని, తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న 25 మంది, మూర్చపోయిన 65 మందిని, నిర్జలీకరణనానికి లోనైన మరికొందరిని మెట్రో సిబ్బంది కాపాడారు. ఇలా అత్యవసర వైద్యసహాయం అవసరమైనవారిలో ఎక్కువమంది ఒంటరిగా ప్రయాణం చేస్తున్నవారు కావడంతోనే మెట్రో సిబ్బంది స్పందించాల్సి వచ్చింది. సహాయకులుగా ఉన్నవారు కోరిన వెంటనే వైద్య సదుపాయాన్ని సమకూర్చేందుకు మెట్రో సిబ్బంది ఎప్పుడూ సిద్ధంగా ఉంటార’ని చెప్పారు.
మెట్రో అత్యవసర వైద్యసేవలు భేష్
Published Sun, Oct 19 2014 10:51 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గాలివాన బీభత్సం
వడదెబ్బకు ఆరుగురు మృతి
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
వేసవి దుక్కులతో మేలు
ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకోవాలి
బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతోంది
నేడు వరంగల్కు ప్రధాని రాక
పోలింగ్ కేంద్రాల సామగ్రిని పరిశీలించిన కమిషనర్
తప్పక చదవండి
Advertisement