రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రారంభం
* ఈ నెల 14 నుంచి 18 వరకు వాణిజ్య సందర్శకులకు మాత్రమే అనుమతి
* సీనియర్ సిటిజన్లకు, వికలాంగులకు ఉచిత ప్రవేశం
సాక్షి, న్యూఢిల్లీ: 34వ అంతర్జాతీయ వాణిజ్య మేళాకు నగరం ముస్తాబైంది. శుక్రవారం రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జి ఈ మేళాను ప్రగతిమైదానంలో ప్రారంభిస్తారు. ఈ నెల 27 వరకు మేళా కొనసాగుతోంది. ఈ నెల 14 నుంచి 18 వరకు వాణిజ్య సందర్శకులను మాత్రమే అనుమతిస్తారు. 18 నుంచి 27 వరకు సామాన్యులకు ప్రవేశం ఉంటుంది.
ఉదయం 9 .30 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు మేళా తెరచి ఉంటుంది. ఐదున్నర వరకూ మేళాలో ప్రవేశ సదుపాయం ఉంటుంది. టికెట్ల విక్రయం మాత్రం సాయంత్రం నాలుగు గంటలకు నిలిపివేస్తారు. సెలవు రోజులు, వారాంతపు రోజుల్లో మధ్యాహ్నం రెండు గంటలకే టికెట్ల విక్రయం నిలిపివేస్తారు.
ప్రవేశ టికెట్లు ఇలా..: మేళాలో ప్రవేశం కోసం గేట్ నంబర్ 1, 2 వద్ద టికెట్లు లభిస్తాయి. అన్ని మెట్రో స్టేషన్లలో మేళా టికెట్లు లభిస్తాయి. ప్రవేశ టికెట్ వెలను వివిధ కేటగిరీలు నిర్ణయించారు. వ్యాపారులకు రోజుకు రూ.400, కాగా సీజనల్ టికెట్ ధర రూ.15,00, సామాన్యుల విషయానికి వస్తే పెద్దలకు రూ.50, పిల్లలకు రూ 30 ఉంది. సెలవు రోజుల్లో శని,ఆదివారాల్లో మేళాను సందర్శించేందుకు పెద్దలు రూ. 80, పిల్లలు రూ.50 టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు, వికలాంగులకు గుర్తింపుపత్రంపై ఉచిత ప్రవేశ సదుపాయం ఉంది. మెట్రో ప్రయాణికుల కోసం ప్రగతిమైదాన్లో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. మెట్రో స్టేషన్లలో కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించడం కోసం మెట్రో టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు.
6000 ఎగ్జిబిట్లు: మహిళా ఎంటర్ ప్రెన్యుయర్లు ఇతివృత్తంగా జరిగే ఈ మేళాలో 6,000 ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం మేళాలో దక్షిణాఫ్రికా భాగస్వామ్య దేశం హోదాలో, థాయ్లాండ్ ఫోకస్ కంట్రీ హోదాలో పాల్గొంటున్నాయి. ఢిల్లీ ఫోకస్ రాష్ట్రం హోదాలో మేళాలో పాల్గొంటోంది.
నేటి నుంచి అంతర్జాతీయ వాణిజ్య మేళా
Published Fri, Nov 14 2014 12:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
గోదారిలో గాలి కబుర్లే..!
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
బారామతిలో అలాంటి చర్యలు పనిచేయవు: అజిత్ పవార్
సీఎం రమేష్ ను కలవడంపై కొమ్మినేని విశ్లేషణ
చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
అప్పుడు కరెక్ట్.. ఇప్పుడు రాంగ్ ఎలా..బయటపడ్డ టీడీపీ కుట్ర
డంప్యార్డ్లో ధనుష్.. ఫ్యాన్స్ అభినందనలు
కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
పెరిగిన రుణాలు.. రెండేళ్లలో రూ.10లక్షల కోట్లు
తప్పక చదవండి
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
Advertisement