జల వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండి వైఖరితో ఉందని, కేంద్రం చేసిన సూచనలను అసలు పట్టించుకోలేదని.. వితండ వాదన చేస్తోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు మండిపడ్డారు. కృష్ణా జలాల పంపిణీపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత రాలేదని, చర్చలు అసంపూర్తిగానే మిగిలాయని చెప్పక తప్పదని అన్నారు. ట్రిబ్యునల్ ఇప్పటికే స్పష్టంగా అవార్డు ఇచ్చిందని, అయినా వాళ్లు పట్టించుకోవడం లేదని తెలిపారు. పై రాష్ట్రాలకు హక్కులుంటాయి కాబట్టే తమకు రావల్సిన 90 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని తెలంగాణ చెప్పిందని తెలిపారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు జూలై మొదటివారంలో అధికారులను నియమిస్తామని, అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగించాలని కేంద్రం చెబితే తాము ఒప్పుకొన్నామని.. కానీ ఏపీ ప్రభుత్వం మొండి, విచిత్రవైఖరి అనుసరించడం వల్ల చర్చ అసంపూర్తిగా ముగిసిందని హరీశ్ రావు చెప్పారు.
అయితే, అసలు తాము చెప్పిన తర్వాత మాత్రమే కేంద్ర జలవనరుల శాఖ అధికారులకు పరిస్థితిపై అవగాహన వచ్చిందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. రాయలసీమ నాలుగు జిల్లాలు కరువులో ఉన్నాయని, వాళ్లకు తాగునీరు కూడా ఇవ్వకుండా ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు సమాచారం ఇవ్వకుండా.. కృష్ణామేనేజిమెంటు బోర్డు ఆదేశాలను పట్టించుకోకుండా ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తికి నీళ్లు ఎలా ఇచ్చారని అడిగితే కేంద్ర అధికారులు ఆశ్చర్యపోయారని అన్నారు. తాము అడిగేసరికి వాళ్లు సమాధానం చెప్పలేకపోయారని, వాస్తవాలను కేంద్రం అర్థం చేసుకుందని చెప్పారు. 3 రోజుల చర్చల్లో విభజన చట్టంలో నీళ్ల కేటాయింపు అంశం గురించి తాము చెప్పిన తర్వాతే కేంద్ర జలనవరుల అధికారులకు అవగాహన వచ్చిందని ఉమా అన్నారు.
వాళ్లది మొండివైఖరి.. వితండవాదన: హరీశ్
Published Thu, Jun 23 2016 12:38 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడం లేదు
ఎంపీ ప్రజ్వల్ను అరెస్ట్ చేయాలి
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- ఐపీఎల్ చరిత్రలో అత్యద్భుతమైన క్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement