లాయర్లకు సీజేఐ జస్టిస్ మిశ్రా హితవు
సాక్షి, చెన్నై: కేసుల వాయిదా, సాగదీయడం వంటి వ్యాధులతో ఏ న్యాయవాది బాధపడకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. మద్రాసు హైకోర్టు వారసత్వ భవంతి 125వ వార్షికోత్సవంలో శనివారం ఆయన ప్రసంగిస్తూ..సమయపాలన న్యాయ నియమావళి లక్షణమని పేర్కొన్నారు.
‘సమయపాలన తప్పనిసరి బాధ్యతగా ధర్మాసనంలోని సభ్యులు, న్యాయవాదులు అర్థం చేసుకోవాలి. న్యాయవాది కేసు వాయిదా, సాగదీయడం చేస్తుంటే.. న్యాయమూర్తి సరైన సమయానికి ధర్మాసనంపైకి రావడం లేదు. వారిద్దరు న్యాయ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారు’ అని జస్టిస్ మిశ్రా అన్నారు. ఒకవేళ న్యాయమూర్తి వాయిదాకు మొగ్గు చూపితే.. కేసుతో తాను సిద్ధమని.. విచారణ కొనసాగించాలని మర్యాదపూర్వకంగా న్యాయవాది చెప్పాలని జస్టిస్ మిశ్రా సూచించారు.
పెండింగ్ కేసుల సత్వర పరిష్కారంపై న్యాయవాదులు, న్యాయమూర్తులు దృష్టి పెట్టాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. పదేళ్లకు పైగా సాగుతున్న పెండింగ్ కేసుల్ని పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా 1894 నాటి అతి పెద్ద లైట్ హౌస్ను జస్టిస్ మిశ్రా ప్రారంభించారు. ఈ లైట్హౌస్కు ఇటీవలే మరమ్మతులు చేసి పునరుద్ధరించారు. కార్యక్రమంలో తమిళనాడు సీఎం పళనిస్వామి, రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి షణ్ముగం, మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, సీనియర్ న్యాయవాది భానుమతి, జడ్జీలు, లాయర్లు పాల్గొన్నారు
వాయిదాలు మానుకోండి
Published Sun, Sep 17 2017 1:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement