నాగ్పూర్: భీమ్-ఆధార్ యాప్ను భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్కు అంకితం చేస్తున్నానని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. శుక్రవారం నాగ్పూర్లోని అంబేద్కర్ స్మారక స్థలం దీక్షా భూమిని సందర్శించి అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఆయన అనంతరం డిజిటల్ లావాదేవీల పెంపుకోసం భీమ్-ఆధార్ యాప్ను ప్రారంభించి అంబేద్కర్కు అంకితం చేశారు. భీమ్-ఆధార్ యాప్ వినియోగంతో ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు అని అన్నారు.
కేవలం వేలిముద్రతో చెల్లింపులు చేయొచ్చని చెప్పారు. మార్కెట్లో నగదు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదని చెప్పారు. 2022లోగా అందరికీ ఇళ్లు ఉంటాయని మోదీ చెప్పారు. అంతకుముందు అంబేద్కర్కు నివాళులు అర్పించిన మోదీ దీక్షా భూమిలో అంబేద్కర్ కోసం ప్రార్థించడం తనకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. దళితులు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన నిరంతరం శ్రమించారని అన్నారు. అంబేద్కర్ను శివుడితో మోదీ పోల్చారు. ఆయన జీవిత కాలంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని దేశ ప్రజలకు మాత్రం అమృతాన్ని పంచారని కొనియాడారు.
‘అవమానాలు ఎదుర్కొని.. అమృతం పంచారు’
Published Fri, Apr 14 2017 3:06 PM
Related news
-
ఇండియా కూటమి గెలిస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు
కొల్హాపూర్/గోవా: కేంద్రంలో విపక్ష ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే ఐదు సంవత్సరాల్లో ఐదుగురు ప్రధానమంత్రులు కుర్చీ ఎక్కుతారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ఆ కూటమి గెలిచే అవకాశమే లేనప్పటికీ ఎవరెప్పుడు ప్రధాని కావాలన్న దానిపై ఇప్పటినుంచే మంతనాలు సాగిస్తున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులను దేశం భరించబోదని అన్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్తోపాటు గోవాలో ఎన్నికల ప్రచారంలో మోదీ ప్రసంగించారు. కర్ణాటకలో ఓబీసీల జాబితాలో ముస్లింలను చేర్చారని తప్పుపట్టారు. దీంతో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు దక్కడం లేదన్నారు.కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కర్ణాటక మోడల్ దేశమంతటా అమల్లోకి వస్తుందంటూ ప్రజలను అప్రమత్తం చేశారు. సామాజిక న్యాయాన్ని హత్య చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమా? అని నిలదీశారు. కాంగ్రెస్కు ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలే తప్ప ప్రజల సంక్షేమం పట్టడం లేదని దుయ్యబట్టారు. వారసత్వ పన్ను విధించి జనం ఆస్తులు లాక్కోవాలని చూస్తున్న పార్టీలను అధికారానికి ఆమడ దూరంలో ఉంచాలని ప్రజలకు నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడానికి ప్రయత్నించింనందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలన్నారు. ఈసారి ఎన్నికలు రెండు శిబిరాల మధ్య జరుగుతున్నాయని వివరించారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తున్న ఎన్డీయే ఒకవైపు, సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతున్న ‘ఇండియా’ కూటమి మరోవైపు ఉందని పేర్కొన్నారు. -
రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర
రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర -
పానీ పూరీ: ఈ అనిల్ భాయ్ లెక్కే వేరు: వైరల్ వీడియో
పానీ పూరీ అంటే ప్రాణం లేచి వస్తుంది చాలామందికి. అయితే పానీ పూరి బండి నడిపే 71 ఏళ్ల వృద్ధుడితో సెల్ఫీల కోసం జనం ఎగబడుతున్నారు. ఆయన పేరే గుజరాత్కు చెందిన అనిల్ భాయ ఠక్కర్. ఈ పానీ పూరీ వాలా ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాడు. స్టోరీ ఏంటంటే.. మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారట. అది ఎంతవరకు నిజమోగానీ, గుజరాత్కు చెందిన అనిల్ భాయ్ ఠక్కర్ మాత్రం తన సైడ్ ప్రొఫైల్, హెయిర్స్టైల్, తెల్లటి గడ్డం, ఆఖరికి డ్రెస్సింగ్ స్టయిల్ కూడా అచ్చం ప్రధాన మంత్రి మోదీ పోలికలతో కస్టమర్లను కట్టిపడేస్తున్నాడు. ఈయన గుజరాత్లోని ఆనంద్లో ‘తులసి పానీ పూరీ సెంటర్’ను నడుపుతున్నాడు. అచ్చం మోదీలా ఉన్న అనిల్ భాయ్నును స్థానికులంతా పీఎం మోదీ అని పిలుచుకుంటారు. ప్రధాని మోదీతో ఉన్న పోలిక కారణంగా స్థానికులు, పర్యాటకుల నుండి తనకు చాలా ప్రేమ, గౌరవం లభిస్తోంది అంటాడు ఆనందంగా అనిల్ భాయ్. అంతేకాదు ప్రధాని తనకు ఎంతో స్ఫూర్తి పొందానని, పరిశుభ్రతకు ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తారో, అలాగే తన స్టాల్ను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటారని అనిల్ భాయ్ చెప్పుకొచ్చాడు. అనిల్ భాయ్ వాస్తవానికి జునాగఢ్కు చెందినవాడు. తన తాత ప్రారంభించిన 'తులసి పానీ పూరీ సెంటర్'ను 18 ఏళ్ల వయస్సునుంచే నడిపిస్తున్నాడు. కాగా ముంబైలోని మలాడ్కు చెందిన వికాస్ మహంతే కూడా ప్రధాని పోలికలతో ఇటీవల వార్తల్లో నిలిచాడు. గర్భా వాయిస్తున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
ఇలాగైతే కష్టం... గ్యారంటీగా గెలవం హామీలతో ముంచేద్దాం
సాక్షి, అమరావతి: జనసేన, బీజేపీతో జట్టుకట్టినా ఘోర పరాజయం తప్పదని ఆందోళన చెందుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అలవికాని బోగస్ హామీలు గుప్పించేందుకు సన్నద్ధమయ్యారు. గతేడాది మే 28న రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో కర్ణాటక, తెలంగాణలలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కాపీ కొట్టి సూపర్ సిక్స్ ముసుగుతో మినీ మేనిఫెస్టో అంటూ ప్రకటించారు. ఆ హామీలు కర్ణాటక, తెలంగాణలలో నీరుగారిపోవడం.. చంద్రబాబు అంటేనే మోసాలకు మరోపేరు అని ప్రజలు గుర్తించడంతో ‘సూపర్ సిక్స్’ను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కారు తరహాలో బోగస్ హామీలతో మేనిఫెస్టోను వదిలేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఆ మేనిఫెస్టోను తాను ప్రకటిస్తే జనం పొరపాటున కూడా నమ్మరని పసిగట్టిన చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో దాన్ని విడుదల చేయించేందుకు ఎత్తులు వేస్తున్నారు. ముఖచిత్రాన్ని మార్చేసిన ‘సిద్ధం’ సభలు, బస్సు యాత్ర..సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసగా భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన ‘సిద్ధం’ సభలకు జనం పోటెత్తడంతో ఒకదానికి మంచి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ప్రజాక్షేత్రంలో సీఎం జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేక చంద్రబాబు తాడేపల్లిగూడెంలో పవన్కళ్యాణ్తో కలిసి నిర్వహించిన జెండా సభ, ప్రధాని మోదీని రప్పించి చిలకలూరిపేటలో నిర్వహించిన సభకు జనం మొహం చాటేయడంతో అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అవకాశవాద పొత్తును జనం ఛీకొట్టారనడానికి జెండా సభ, చిలకలూరిపేట సభ నిదర్శనంగా నిలిస్తే.. సీఎం జగన్పై ప్రజల విశ్వాసానికి ప్రతీకగా ‘సిద్ధం’ సభలు నిలిచాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలకు ఏ ప్రాంతంలోనూ జన స్పందన కనిపించడం లేదు. మరోవైపు ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా గత నెల 27 నుంచి ఈ నెల 24 వరకూ 23 జిల్లాల్లో సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. తీవ్ర ఫ్రస్టేషన్తో ఊగిపోతున్న బాబు..సీఎం జగన్ బస్సు యాత్ర సృష్టించిన ప్రకంపనలతోపాటు ఏకంగా 20కిపైగా జాతీయ మీడియా సంస్థలు, పొలిటికల్ కన్సెల్టెన్సీలు నిర్వహించిన సర్వేల్లో వైఎస్సార్సీపీ మరోసారి ఘనవిజయం సాధిస్తుందని తేల్చిచెప్పడంతో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిలో నైరాశ్యం నెలకొంది.నామినేషన్ల ఘట్టంలోనే కాడి పారేస్తున్నాయి. తీవ్ర ఫ్రస్టేషన్ (నిరాశ, నిస్పృహ)తో సీఎం జగన్పై నోరు పారేసుకుంటున్నారు. ఇటీవల విజయనగరంలో ప్రజాగళం సభలో సీఎం జగన్ను తూలనాడే క్రమంలో.. నెత్తిపై రూపాయి పెడితే పైసాకు కొనుక్కోవడానికి కూడా పవన్ కళ్యాణ్ పనికి రారంటూ చంద్రబాబు తన మనసులో మాట బయట పెట్టడమే అందుకు నిదర్శనం. ఇక చంద్రబాబు భార్య భువనేశ్వరి తన వద్ద పనిచేసే బడుగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా బూతుపురాణం వల్లించడం వారి ఫ్రస్టేషన్కు పరాకాష్ట. వైఎస్సార్సీపీ శ్రేణులపై భౌతిక దాడులకు దిగాలంటూ టీడీపీ, జనసేన కార్యకర్తలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతుండటం చూస్తే వారిలో ఫ్రస్టేషన్ ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. అప్పటిలాగే బోగస్ హామీలతో ఇప్పుడూ..విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లోనూ జనసేన, బీజేపీలతో జట్టుకట్టిన చంద్రబాబు వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా.. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతిగా ఇస్తానంటూ నాడు 650కిపైగా అలవికాని హామీలిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్, తన ఫోటోలను ముద్రించిన పత్రంతో ముఖ్యమైన హామీలంటూ తన సంతకం చేసి మరీ ఇంటింటికీ పంపి ప్రచారం చేయించారు. అనంతరం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కి ప్రజలను నిలువునా మోసం చేశారు. ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో ఎన్నికల మేనిఫెస్టోను ఏకంగా టీడీపీ వెబ్సైట్ నుంచి చంద్రబాబు మాయం చేయించారు.ఇప్పుడూ అదే కూటమిగా జట్టు కట్టిన చంద్రబాబు 2014 తరహాలోనూ బోగస్ హామీలతో మరోసారి ప్రజలను బురిడీ కొట్టించేందుకు ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు చేస్తున్నారు. ఆ మేనిఫెస్టోను తాను ప్రకటిస్తే ప్రజలు ఛీకొడతారని గుర్తించడంతో మే 3వ తేదీన రాష్ట్రంలో నిర్వహించే సభలో ప్రధాని మోదీతో విడుదల చేయించేందుకు సిద్ధమైనట్లు టీడీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మళ్లీ ‘ఫ్యాన్’ ప్రభంజనం ఖాయంరాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని సీఎం జగన్ బస్సు యాత్ర సమూలంగా మార్చేసిందని.. పోటీ ఏకపక్షమేనని.. వైఎస్సార్సీపీ విజయం లాంఛనమేనని పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్సీపీ, కూటమి అభ్యర్థులు తేలాక జాతీయ మీడియా సంస్థలు, ప్రతిష్టాత్మక పొలిటికల్ కన్సల్టెన్సీలు నిర్వహించిన 20 సర్వేల్లో ‘‘ఫ్యాన్’’ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని తేల్చాయి.సీ–ఓటర్ సర్వే ఒక్కటి మాత్రమే కూటమి విజయం సాధిస్తుందని పేర్కొంది. అయితే సీ–ఓటర్ నిర్వహించే సర్వేలకు ఏమాత్రం విశ్వసనీయత ఉండదు. 2004, 2009లో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ గెలుస్తుందని సీ–ఓటర్ పేర్కొనగా ఆ రెండు సందర్భాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించడం గమనార్హం. 2019 ఎన్నికల్లోనూ టీడీపీ గెలుస్తుందని సీ–ఓటర్ ఢంకా భజాయిస్తే వైఎస్సార్సీపీ చారిత్రక విజయం సాధించింది. -
మోదీతో ఫైనల్స్
సాక్షి, హైదరాబాద్/ మెదక్ జోన్: ‘రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సెమీ ఫైనల్స్ మాత్రమే. ఇప్పుడు ఫైనల్స్ ఆడుతున్నాం. సెమీస్లో బంగ్లాదేశ్ జట్టు లాంటి కేసీఆర్ను ఓడించాం. ఇప్పుడు పాకిస్తాన్ జట్టు లాంటి మోదీతో కొట్లాడాలి. బీజేపీ నేతలు అమిత్షా, జేపీ నడ్డా సహా ముఖ్య నేతలు తెలంగాణపై ముప్పేట దాడి చేస్తున్నారు. ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగిస్తున్నారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూస్తున్నారు. సోషల్ మీడియా కార్యకర్తల రెక్కల కష్టంతో ఏర్పడిన ప్రభుత్వమిది. దీన్ని మీరే కాపాడుకోవాలి.ప్రతి నిమిషం అలర్ట్గా ఉండాలి. 14 ఎంపీ సీట్లలో విజయమే లక్ష్యంగా పనిచేయాలి. రేవంత్ లేకపోతే చాలు.. ఎవరైనా ఫర్వాలేదు అనే పరిస్థితికి బీఆర్ఎస్ నేతలు వచ్చారు. బిడ్డ కవిత బెయిల్ కోసం బీజేపీతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు..’ అని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్లో కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో, ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో జరిగిన జనజాతర సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ ‘పదేళ్ల పాలనలో మోదీ, కేసీఆర్ దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకున్నారు. దేశంలో రిజర్వేషన్లను రద్దు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కుట్రలు చేస్తున్నారు.ఈ ఎన్నికలు దేశానికి అత్యంత కీలకం. రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఉద్దేశంతోనే 400 సీట్ల నినాదాన్ని బీజేపీ చేస్తోంది. రిజర్వేషన్లు రద్దు చేసి ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు అమ్మేసే కుట్ర జరుగుతోంది. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు. బ్రిటిష్ జనతా పారీ్టగా మారింది. బ్రిటిష్ వాళ్ల మాదిరిగానే మోదీ దేశాన్ని దోచుకొనేందుకు రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారు. ఏళ్ల తరబడి కులగణన జరగడం లేదు. దీంతో బీసీలకు జనాభా లెక్కల ప్రకారం దక్కాల్సిన లబ్ధి దక్కడం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కులగణన జరిగితేనే రిజర్వేషన్ కల్పించడం సాధ్యమవుతుంది..’ అని రేవంత్ అన్నారు. జహీరాబాద్ స్థానం బీజేపీకి తాకట్టు ‘లోక్సభ ఎన్నికల్లో 12 సీట్లలో గెలిపిస్తే ఏడాదిలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కేటీఆర్ అంటున్నారు. అదెలా సాధ్యం? ఇక్కడ అల్లాటప్పాగా కూర్చున్నామా? తండ్రి పేరు చెప్పుకొని కురీ్చలోకి వచ్చామా? బిడ్డ కవిత బెయిల్ కోసం బీజేపీతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు. తన బిడ్డ కోసం జహీరాబాద్ స్థానాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారు. జహీరాబాద్లో బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ను గెలిపించే కుతంత్రంలో మెదక్లో గాలి అనిల్కుమార్కు టికెట్ ఇవ్వాల్సి ఉండగా జహీరాబాద్లో ఇచ్చి గాలికి వదిలేశారు.తెలంగాణ రాష్ట్రం సాధించేందుకు 60 ఏళ్లుగా అనేక పోరాటాలు జరిగాయి. చివరకు సోనియమ్మ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది. కానీ రాష్ట్రంలో ఎవరికీ ఉద్యోగాలు రాకపోగా కేసీఆర్ కుటుంబానికి.. కొడుకు, కూతురు, అల్లుడుతో పాటు ఆయన బంధువులందరికీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రి పదవులు దక్కాయి. పదేళ్లుగా గడీల్లో తెలంగాణ తల్లిని బందీ చేశారు. గడీలను బద్ధలు కొట్టి తెలంగాణ తల్లికి విముక్తి కల్పించాం..’ అని సీఎం చెప్పారు. వైఎస్సార్ హయాంలో సంక్షేమ పథకాలు ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ హయాంలో పేదలకు సంక్షేమ పథకాలు అందాయి. అప్పట్లో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టడం జరిగింది. రూ.400కే వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. పేదలకందరికీ ఉచిత వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టారు. కానీ కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని చెప్పి ఎవరికీ కట్టించిన పాపాన పోలేదు..’ అని రేవంత్ విమర్శించారు. ‘సోనియాగాంధీ అభీష్టం మేరకు ప్రవేశ పెట్టిన 6 గ్యారెంటీలను తూచా తప్పకుండా అమలు చేస్తాం. ఇప్పటికే ఐదు గ్యారెంటీలు అమలు చేశాం..’ అని తెలిపారు. ఆగస్టు 15 తర్వాత సిద్దిపేటకు శని వదిలిపోతుంది ‘హరీశ్రావు మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం. మోసం చేయాలనుకున్న ప్రతిసారీ ఆయనకు స్తూపం గుర్తొస్తుంది. హరీశ్రావు సవాల్ను స్వీకరించా. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని చెప్పా. ఆ తేదీ తర్వాత సిద్ధిపేటకు ఆయన శని వదిలిపోతుంది..’ అని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘హరీశ్రావు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లారా? రైతు రుణమాఫీతో పాటు మిగతా అంశాలను పేర్కొంటూ తన మామ చెప్పిన సీస పద్యమంతా రాజీనామా లేఖలో రాసుకొచ్చారు.స్పీకర్ ఫార్మాట్లో లేకుంటే రాజీనామా చెల్లుతుందా? మళ్లీ చెప్తున్నా.. ఆగస్టు 15 లోపు రుణ మాఫీ చేస్తా. హరీశ్రావు రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలి. రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు? దానికి రూ.30 –రూ.40 వేల కోట్లు అవుతుంది. కాళేశ్వరంలో మీరు దోచుకున్న రూ.లక్ష కోట్ల కంటే అది ఎక్కువా? హైదరాబాద్ చుట్టూ ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువా?..’ అని సీఎం ఎద్దేవా చేశారు. హరీశ్.. రాజీనామా లేఖ రెడీ పెట్టుకో..హరీశ్రావు సవాల్ను స్వీకరించా. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తానని చెప్పా. ఆ తేదీ తర్వాత సిద్ధిపేటకు ఆయన శని వదిలిపోతుంది. రైతు రుణమాఫీతో పాటు మిగతా అంశాలను పేర్కొంటూ తన మామ చెప్పిన సీస పద్యమంతా రాజీనామా లేఖలో రాసుకొచ్చారు. స్పీకర్ ఫార్మాట్లో లేకుంటే రాజీనామా చెల్లుతుందా? మళ్లీ చెప్తున్నా.. ఆగస్టు 15 లోపు రుణ మాఫీ చేస్తా. హరీశ్రావు రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలి.
Related News by category
-
మోసాల బాబు వద్దు.. జగన్ ముద్దంటున్న జనం
అది కాదురా అప్పలరాజు.. కంకర్రాళ్ళు గంపెడు ఎందుకురా.. పనికొచ్చే రత్నం ఒక్కటి ఉంటె సరిపోదేట్రా.. ఎదవ సంతానం పదిమందిని కంటే యేటి లాభం.. వజ్రంలాంటి కొడుకు ఒక్కడు ఉంటె సరిపోదేట్రా.. కాయలివ్వని చెట్లు వెయ్యి ఉంటె యేటి లాభం.. పళ్ళిచ్చే మొక్క ఒక్కటి సరిపోదేట్రా.. అంటున్నారు నారాయణ.. ఒరేయ్ బాబు నీ ఎగ్జామ్పుల్స్ ఆపురా నాయిన ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావ్... హాయిగా తాటిముంజెలు తిని ప్రశాంతంగా కూకోరా అన్నాడు... అప్పలరాజు... వెంటనే నారాయణ అందుకుని.... అదేరా.. నిన్న జగన్ మ్యానిఫెస్టో ఇచ్చాడు కదా... అదైతే నాకు నచ్చిందిరా... చక్కగా రైతులకు... మహిళలకు, చిరు ఉద్యోగులకు తాను ఏమి చేయగలడో అది క్లారిటీగా చెప్పేసాడు... చంద్రబాబు మాదిరి వంద మాటలు చెప్పి రెండు అమలు చేసి మిగతావి ఎగదొబ్బే రకం కాదని లచ్ఛమంది సమక్షంలో ఒప్పుకున్నాడు.తండ్రి మాదిరి మనిషిరా... ఎక్కడా మాయ మర్మం.. ఉండవు... చెప్పేదే చేస్తాడు..చేసేదే చెబుతాడు...అదన్నమాట... అన్నాడు నారాయణ... ఐతే ఇప్పుడేమంటావ్ రా బాబు అన్నాడు అప్పలరాజు... నేనేమీ అనడం లేదురా.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నాయకుడు మనకు ఉండాల... చంద్రబాబు మాదిరి వెయ్యి మాటలు చెప్పి... రెండో మూడో అమలు చేసి కాదన్నా మ్యానిఫెస్టోను దాచేసేవాడు మనకు వద్దురా బాబు... ఎంత చేయగలడో... అదే చెప్పాడు.. కాబట్టి నాకు మరొక్కసారి జగన్ నచ్చాడురా... అన్నాడు.. నారాయణ.. నువ్వన్నదీ నిజమేరా.. అలా నిజాయితీగా చేసేవాళ్ళు... చెప్పేవాళ్ళు లేరిప్పుడు... ఇక చంద్రబాబు ఐతే మొత్తం మాయ చేస్తాడు... అలాంటివాళ్లను ఇప్పటికే మూడుసార్లు నమ్మి మునిగిపోయాం చాలురా బాబూ... అనుకుంటూ తాటిముంజెలు తింటూ కూర్చున్నారు ఇద్దరు...అమలు చేయని హామీలు ఎన్ని ఇస్తే ఏమి లాభం... కదలని చెక్క గుర్రం ఎంత బావుంటే ఏమి లాభం.... పాలివ్వని ఆవు ఎంత అందంగా ఉంటె ఏమి లాభం... అలాగే అమలు చేయని మ్యానిఫెస్టోలో ఎన్ని పథకాలు ఎన్ని హామీలు ఉంటె ఏమి లాభం... అందుకే చెప్పేదే చేస్తాం... చేసేదే చెబుతాం .... విశ్వసనీయతే మా ప్రాణం... ఇచ్చిన మాట మీద నిలబడడమే మా విశ్వసనీయత అంటూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన మ్యానిఫెస్టో ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆకాశాన్నంటే హామీలు లేవు...ఇంటింటిలో బంగారం గుమ్మరిస్తాం అనే బొంకులు లేవు.. ఊరూవాడా పందిరివేస్తాం... రోజూ మీకు విందుభోజనాలు పెడతాం అనే మాయలు లేవు... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ...ఎక్కడెక్కడ .. ఏఏవర్గాలకు ఏయే విధంగా మరింత మేలు చేయగలమో అక్కడక్కడా అలా చేస్తూ వెళతాం అంటూ హామీ ఇచ్చారు.. అమ్మఒడి .. రైతుభరోసా వంటివి ఆయావర్గాలకు మేలు చేస్తాయి.ఇక మిగతా పథకాలు ఇప్పటికే అమలులో ఉన్నవి వాటిని యథాతథంగా కొనసాగిస్తారు... అన్నిటికీ మించి చంద్రబాబు మాదిరిగా నోటికొచ్చింది చెప్పడం, తరువాత మాట తప్పడం జగన్ వద్ద ఉండదు.. ఏది చెబుతారో అదే చేస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉండడంతో ఉన్నవి చాలు... ఈ మాత్రం సరిగ్గా అమలైతే ఇంకేం కావాలి... చంద్రబాబు వస్తే అవి కూడా ఇవ్వడు.. మాటలు చెప్పి ఓట్లేయించుకుని మోసం చేస్తాడు అని ప్రజలు తమ అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. జగన్ అన్న ఉంటే చాలు... ఉన్న పథకాలు అమలు చేస్తారు అనే నమ్మకం ప్రజల్లో కనిపిస్తోంది.AP people praising cm ys jagan manifesto 2024 for ap elections:::: సిమ్మాదిరప్పన్న -
నన్ను కొట్టిన వాడి చేయి తీసేస్తా ..
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘కొట్టడం అనేది ఎగైనెస్ట్ ది లా... పొరపాటున ఎవడైనా చేస్తే ఏదో ఒక రోజు నాకు టైం వస్తుంది. కొట్టినవాడి చెయ్యి తీసేస్తా.. ఎవడైతే చేశాడో.. ఏదో ఒకరోజు ఐదేళ్లకో, పదేళ్లకో, పదిహేనేళ్లకో.. వాడు ఎంత చేస్తే అంతకు డబుల్ చేస్తా....’ ‘ఇదే అమెరికాలో అయితే కాల్చేస్తారు... ’ ‘వైఎస్సార్ సీపీ నాయకులు సద్దాం హుస్సేన్లా వ్యవహరిస్తున్నారు. సద్దాం హుస్సేన్ కూడా తన ఇష్టారీతిగా వ్యవహరించినందునే బంకర్లో దాగి ఉన్నా లాక్కొచ్చి కుక్కను కొట్టినట్లు కొట్టి చంపారు.’పై వ్యాఖ్యలు ఎవరో రౌడీనో, గుండానో, చదువుకోని వ్యక్తో చేసినవి కాదు. డాక్టర్ చదివి అమెరికాలో వ్యాపారాలు చేసి గుంటూరు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ పలు సందర్భాలలో చేసినవి. రెండు రోజుల క్రితం ఒక పచ్చ మీడియా అధినేతతో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక వేళ మీపై కేసులు పెడితే, కొడితే ఏం చేస్తారు అని ప్రశి్నస్తే తనను కొట్టడం చట్టానికి విరుద్దం అని చెబుతూనే తనను కొట్టిన వారిని మాత్రం చెయ్యి తీసేస్తానంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడటం గమనార్హం. దేశంలోనే అత్యంత ధనవంతుడిగా పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగిన చంద్రశేఖర్ మొదటి నుంచి డబ్బుందన్న అహంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సొంత పార్టీ నేతలే వాపోతున్నారు. చంద్రశేఖర్ అనాలోచితంగా చేస్తున్న వ్యాఖ్యలు పారీ్టకి చేటు తెస్తున్నాయని వారు అంటున్నారు.ఇప్పటికే ఆయన తీరుపై కాపు సామాజిక వర్గం నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఆయన గుంటూరు బరిలోకి దిగిన తర్వాత ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క కాపు వర్గం నేతకు కూడా సీటు దక్కలేదు. అయినా పార్టీ కోసం పనిచేయడానికి వెళ్లిన వారికి ఛీత్కారాలే ఎదురయ్యాయి. తమ పారీ్టతో పాటు మిత్రపక్షాలలో ఉన్న కాపు నేతలు కూడా కూటమికి గుడ్బై చెప్పి వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. ఇటీవల కాలంలో బీజేపీ ఇంటలెక్చువల్ సెల్ స్టేట్ కో–కనీ్వనర్ డాక్టర్ టి.వి.రావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందు సాంబశివరావు పార్టీని వీడారు. మరికొంత మంది పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. అమెరికాలో రూ.వందల కోట్లు సంపాదించి గుంటూరులో రాజకీయం చేయాలని డిసైడైన చంద్రశేఖర్ కనీసం నియోజకవర్గానికి ఏం చేస్తాడో కూడా చెప్పడం లేదు. తాను గెలిచిన తర్వాత అభివృద్ధి చేసి చూపిస్తానని చెబుతున్నాడు. 2014, 2019 ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ టిక్కెట్ కోసం ప్రయత్నించిన చంద్రశేఖర్, అనుకోని పరిస్థితుల్లో 2024లో గుంటూరు పార్లమెంట్ నుంచి బరిలోకి దిగారు. గెలిస్తేనే ఇక్కడ ఉంటారని, ఓడిపోతే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోతారని తెలుగుదేశం నేతలు అభిప్రాయపడుతున్నారు. 2014, 2019లో చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన గల్లా జయదేవ్ను గెలిపిస్తే నియోజకవర్గానికి సేవ చేయకపోగా చివరి నాలుగు సంవత్సరాలు అసలు కనపడకుండా పోయాడు.వరసగా రెండుసార్లు గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించినా గల్లా ప్రజలకు చేసిందేమి లేదనే చెప్పాలి. మొదటిసారి 2014లో ఇంటికో ఉద్యోగం వచ్చేలా చేస్తానని, 2019లో తన పరిశ్రమలను గుంటూరు చుట్టుపక్కల స్థాపించి ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీలు గుప్పించారు. హామీలు అమలు చేయకపోగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యాపారాలు చూసుకున్నారు. తన వద్ద డబ్బు ఉంది కాబట్టి డబ్బు కుమ్మరించి గెలవగలననే ధీమా పెమ్మసాని వ్యక్తం చేస్తున్నారు. తనకు భారీ మెజారిటీ వస్తుందంటూ ప్రగల్భాలు పలుకుతుండటం, నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతుండటంతో అసలుకే ఎసరు వస్తుందన్న భయం తెలుగుదేశం నేతల్లో కనపడుతోంది. -
కాంగ్రెస్కు షాక్.. ఢిల్లీ పీసీసీ చీఫ్ రాజీనామా
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్కు ఢిల్లీలో షాక్ తగిలింది. ఢిల్లీ పీసీసీ అధ్యక్ష పదవికి అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా చేశారు. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంపై అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయాలకు భిన్నంగా పార్టీ అధిష్టానం ఆప్తో పెట్టుకోవడంపై నిరసనగా రాజీనామా చేశారు. అధిష్టానం తన అభిప్రాయాలను పట్టించుకోవడంలేదని కాంగ్రెస్కు రాసిన రాజీనామా లేఖ పేర్కొన్నారు. -
ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
నల్లగొండ: తనను గెలిపిస్తే ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించి పరిష్కార మార్గం చూపుతానని బీజేపీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం రాత్రి హాలియా పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి మాజీ మంత్రి జానారెడ్డి చేసిందేమీ లేదన్నారు. నియోజకవర్గంలో పేదలకు సరైన వైద్యం అందక హైదరాబాద్కు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కంకణాల నివేదితారెడ్డి, హాలియా మున్సిపాలిటీ ఇన్చార్జి మన్నెం రంజిత్యాదవ్, చెన్ను వెంకటనారాయణరెడ్డి, డాక్టర్ పానుగోతు రవికుమార్, చలమల్ల వెంకట్రెడ్డి పాల్గొన్నారు.దాచుకోవడం, దోచుకోవడమే కాంగ్రెస్ లక్ష్యంపెద్దవూర: అధికారంలోకి వస్తే దాచుకోవడం, దేశాన్ని దోచుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని బీజేపీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం రాత్రి పెద్దవూర మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయినా ఇప్పటికి ఒక్క గ్యారంటీని నెరవేర్చలేదని ఆరోపించారు. దేశంలో అవినీతిరహిత పాలన కేవలం ప్రధాని నరేంద్ర మోదీతోనే సాధ్యమని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లు వారసత్వ పార్టీలని తెలిపారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి వచ్చే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వానివే అని పేర్కొన్నారు. కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ఏరుకొండ నర్సింహ, దినేష్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
అమేథీలో కాంగ్రెస్ 1981 ఫార్ములా?
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ నుంచి పోటీ చేయనున్నారని ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలు అంటున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయమై నోరు మెదపలేదు. అయితే పార్టీ 1981 నాటి ఉప ఎన్నికల ఫార్ములాను ఇప్పుడు అనుసరించనున్నదనే మాట వినిపిస్తోంది.1981లో కాంగ్రెస్ నామినేషన్ల పర్వం ప్రారంభమైన తర్వాతనే అభ్యర్థులను రంగంలోకి దించింది. రాజీవ్ గాంధీని యూపీలోని అమేథీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన రోజునే రాజీవ్ గాంధీ తన నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఇదే విధానాన్ని కాంగ్రెస్ అనుసరించనున్నదని కొందరు పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.మరోవైపు అమేథీలో బీజేపీ మినహా ఏ పార్టీ కూడా అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ఎస్పీ-కాంగ్రెస్ పొత్తులో అభ్యర్థి ఎవరనేదానిపై బీఎస్పీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అదేసమయంలో బీఎస్పీ అభ్యర్థి ఖరారైనట్లు కూడా ప్రచారం జరుగుతోంది.ఇప్పటి వరకు రాహుల్ గాంధీ తాను అమేథీ నుంచి పోటీ చేస్తానని చెప్పలేదు. అమేథీ నుంచి బీజేపీ తరుపున స్మృతి ఇరానీ ఎన్నికల రంగంలోకి దిగారు. కాగా రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయనున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ప్రదీప్ సింఘాల్ ప్రకటించారు.
Advertisement
Photos
View allVideo
View allహైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
కాంగ్రెస్కు షాక్.. ఢిల్లీ పీసీసీ చీఫ్ రాజీనామా
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement