న్యూఢిల్లీ: నగరంలో విద్యుత్ సంక్షోభాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం నెహ్రూ ప్లేస్ ప్రాంతంలోని బీఎస్ఈఎస్ కార్యాలయం ఎదుట భారీ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బీఎస్ఈఎస్కు వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ బీఎస్ఈఎస్ సంస్థ గంటల తరబడి విద్యుత్ సరఫరాలో కోత విధిస్తోందని ఆరోపించారు. ఈ కారణంగా నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కాగా ఎండ తీవ్రంగా ఉండడంతో జాతీయ రాజధానిలో విద్యుత్ డిమాండ్ అత్యధికంగా 5,925 మెగావాట్లకు చేరుకుంది.
ఈ నెల 11వ తేదీన ఇది 5,810 మెగావాట్లు మాత్రమే. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.డిమాండ్ పెరిగిన కారణంగా కొన్ని ప్రాంతాల్లో గంట నుంచి దాదాపు నాలుగు గంటలమేర కోత విధించామన్నారు. వాస్తవానికి విద్యుత్ కొరత లేదని, బీఎస్ఈఎస్ డిస్కం నెట్వర్క్లో లోపాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతోందని అన్నారు.అయితే ఈ విషయమై స్పందించేందుకు బీఎస్ఈఎస్ అధికారులు నిరాకరించారు. మరోవైపు విద్యుత్ బిల్లుల విషయంలో నగరవాసులకు ఊరట కలిగించేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం..
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ని సోమవారం కలిసింది. దీంతోపాటు కోతల విషయంలోనూ తగు చర్యలు తీసుకోవాలని కూడా కోరింది. దిగువ, మధ్యతరగతి ప్రజలకు విద్యుత్ బిల్లుల్లో సబ్సిడీ ఇవ్వాలని విన్నవించింది. సబ్సిడీ కోసం నిధులు కేటాయిస్తామన్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం తొందరపాటుతనంతో గద్దె దిగిందని, దీంతో సామాన్యులు ఇబ్బందులకు గురికాక తప్పడం లేదని తెలిపింది. వేళాపాళా లేకుండా డిస్కంలు విద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నాయని, ఇకమీదట ఆవిధంగా జరగకుండా చూడాలని విన్నవించింది.
బీఎస్ఈఎస్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన
Published Tue, Jul 15 2014 10:22 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement