సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో వరద పరిస్థితిలో ఎలాంటి పురోగతి లేదు. మూడు జిల్లాల్లో ఎటు చూసినా నిండా మునిగిన నివాస ప్రాంతాలు, చెరువుల్లా మారిన రోడ్లే కనిపిస్తున్నాయి. గత ఆరు రోజులుగా చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాల్లో కురుస్తున్న వర్షాల వల్ల శనివారం సాయంత్రం వరకు పది లక్షల ఇళ్లు నీటమునిగాయి. తమిళనాడు, పుదుచ్చేరిలోని తీర ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. గడిచిన 24 గంటల్లో నాగపట్నంలోని తలైనయిరులో 27 సె.మీ.లు, థిరుత్తరపోండిలో 24 సె.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సుమారు రెండు లక్షల ఎకరాల్లో పంట నీట మునిగిందని అధికారులు వెల్లడించారు. ముంపు ప్రాంతాలను ఎన్డీఆర్ఎఫ్ దళాలు హెలికాప్టర్లో తిరుగుతూ పర్యవేక్షిస్తున్నాయి. చెన్నై సహా ఆరు జిల్లాల్లో 208 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య మంత్రి భాస్కర్ తెలిపారు. పట్టాలపై రెండు అడుగుల వరదనీరు చేరిపోవడంతో చెన్నై నుంచి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రభుత్వంపై విమర్శలు చేయడం మాని వరద సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా నటుడు కమల్హాసన్ తన అభిమానులకు పిలుపునిచ్చారు.
ఎటుచూసినా ముంపే
Published Sun, Nov 5 2017 2:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
Advertisement