పక్కదారి పట్టించేందుకు విపక్షం కుట్ర
♦ వ్యతిరేక రాజకీయ వ్యూహంలో చిక్కుకోవద్దు
♦ బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ ముగింపు కార్యక్రమంలో మోదీ
♦ భావ ప్రకటన స్వేచ్ఛ, జాతీయవాదాన్ని విడదీసి చూడలేం: జైట్లీ
న్యూఢిల్లీ: ప్రభుత్వాన్ని అభివృద్ధి మార్గం నుంచి పక్కదారి పట్టించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఢిల్లీలో ఆదివారం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. ‘వికాస్, వికాస్, వికాస్.. ఇదే నా ఏకైక లక్ష్యం. మన దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు ఇదొక్కటే మంత్రం. మన లక్ష్యంపైనే దృష్టి పెడదాం. విపక్షాల వ్యతిరేక రాజకీయాల ఉచ్చులో పడొద్దు. కార్యకర్తలంతా సృజనాత్మకంగా వ్యవహరిస్తూ దేశవ్యాప్తంగా పల్లెల వరకు చేరుకోవాలి. మనం వెళ్తున్న దారినుంచి పక్కకు తప్పించేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి.. మన పార్టీ సభ్యులంతా వీటి ప్రభావానికి లోనుకాకుండా అభివృద్ధి దిశగా మన లక్ష్యాన్నే మనసులో పెట్టుకోవాలి’ అని అన్నారు.
సమావేశ వివరాలను కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ మీడియాకు వెల్లడించారు. ‘గ్రామాలకు వెలుగులు అందించాలనే లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకున్నాం. 65 ఏళ్లుగా చీకట్లో ఉన్న దేశానికి వెలుగులిచ్చాం. 22 నెలల పాలనలో ఎక్కడా అవినీతి మరకల్లేవు. ‘బేటీ బచావ్-బేటీ పఢావ్’ వంటి ఎన్నో పథకాలను ప్రభుత్వం ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తోంది. ఈ విషయాలను ప్రతి బీజేపీ కార్యకర్త బాధ్యతగా గ్రామాలవరకు తీసుకెళ్లాలని ప్రధాని తెలిపారు’ అని రాజ్నాథ్ వెల్లడించారు. ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపైనే బీజేపీ ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఆదివారం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి జైట్లీ మీడియాతో మాట్లాడుతూ.. ‘జాతీయవాదం, భావప్రకటన స్వేచ్ఛ ఒకదానితో మరొకటి సమ్మిళితమై ఉంటాయి’ అని అన్నారు.
విభేదించే హక్కుందని.. దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఏ విషయాన్ని సహించమని ఆయన తెలిపారు. ‘భారత్ మాతాకీ జై’ నినాదంపై జరుగుతున్న వివాదాన్ని పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదన్న జైట్లీ.. భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా ఈడెన్ గార్డెన్స్లో ఈ నినాదమే మార్మోగిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. గత ప్రభుత్వాలు సరైన దిశానిర్దేశం లేకుండా పాలన సాగించాయని.. కానీ ప్రస్తుత ప్రభుత్వం సమర్థవంతమైన నాయకత్వంలో ప్రగతిశీల పాలన, జాతీయవాద విధానాలతో ముందుకెళ్తోందని జైట్లీ వెల్లడించారు. నాలుగురాష్ట్రాల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించినట్లు మంత్రి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీలతో కుదుర్చుకుంటున్న పొత్తులతో కాంగ్రెస్ పార్టీ తన ప్రతిష్ట తగ్గించుకుందన్నారు.
మోదీ.. దేవుడిచ్చిన వరం: వెంకయ్య
అంతకుముందు రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి వెంకయ్య.. ‘ప్రధాన మంత్రి మోదీ భారత దేశానికి దేవుడిచ్చిన వరం. పేదల పాలిట భగవంతుడు’ అని ప్రశంసించారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్లో ఆయన జన్మస్థలానికి ప్రధాని వెళ్తారని పార్టీ ప్రకటించింది.
అభివృద్ధే నా ఊపిరి!
Published Mon, Mar 21 2016 12:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్లైట్స్
కాంగ్రెస్కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ముస్లిం రిజర్వేషన్లే రద్దు
- ‘నల్లసూరీడు’పై నజర్
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
Advertisement