కోల్కతా: దేశంలోని తూర్పు రైల్వేకు బెదిరింపుల లేఖ వచ్చింది. రూ.50 కోట్లు ఉన్న పలంగా ఇవ్వకుంటే హౌరా డివిజన్లోని ప్రయాణీకులకు హానీ తలపెడతామని, రైళ్లకు ఇబ్బందులు సృష్టిస్తామని హెచ్చరిస్తూ కోల్ కతాలోని తూర్పు రైల్వే ఉన్న కార్యాలయాలకు ఈ లేఖ వచ్చింది.
‘చేతి వ్రాతతో రాసిన బెదిరింపు లేఖ ఒకటి ఈ రోజు హెడ్ క్వార్టర్స్కు వచ్చింది. మేం దానిని పోలీసులకు విచారణ కోసం అందించాం’ అంటూ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆర్ బద్రినారాయణ్ చెప్పారు. ఆ లేఖలో రూ.50కోట్లు చెల్లించాలని రాశారని, ఫోన్ నెంబర్ కూడా రాశారని ఆయన తెలిపారు. వారి డిమాండ్ను నెరవేర్చకుంటే హౌరా డివిజన్కు హానీ తలపెడతామని హెచ్చరించారని వివరించారు. వెంటనే తాము అన్ని రైల్వే స్టేషన్లలో, రైళ్లలో భద్రతను కట్టుదిట్టం చేసి అప్రమత్తత ప్రకటించినట్లు చెప్పారు.
‘చేతి వ్రాతతో రాసిన బెదిరింపు లేఖ ఒకటి ఈ రోజు హెడ్ క్వార్టర్స్కు వచ్చింది. మేం దానిని పోలీసులకు విచారణ కోసం అందించాం’ అంటూ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆర్ బద్రినారాయణ్ చెప్పారు. ఆ లేఖలో రూ.50కోట్లు చెల్లించాలని రాశారని, ఫోన్ నెంబర్ కూడా రాశారని ఆయన తెలిపారు. వారి డిమాండ్ను నెరవేర్చకుంటే హౌరా డివిజన్కు హానీ తలపెడతామని హెచ్చరించారని వివరించారు. వెంటనే తాము అన్ని రైల్వే స్టేషన్లలో, రైళ్లలో భద్రతను కట్టుదిట్టం చేసి అప్రమత్తత ప్రకటించినట్లు చెప్పారు.