రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పికలేరు అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. భద్రత దళాలకు.. మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఈ మేరకు భద్రత దళ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి తుపాకీ, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
పికలేరు అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి భద్రత దళాలు కూంబింగ్ నిర్వహించాయి. ఆ విషయాన్ని గమనించిన మావోయిస్టులు.. భద్రతదళ సిబ్బంది పైకి కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన భద్రత సిబ్బంది ఎదురు కాల్పులకు దిగారు. దాంతో మావోయిస్టులు పరారైయ్యారు. భద్రత దళాలు... మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు.