సుక్మా ఘటనపై రాజ్‌నాథ్‌ దిగ్ర్భాంతి | Sakshi
Sakshi News home page

జవాన్లపై దాడి పిరికిపందల చర్య: ప్రధాని మోదీ

Published Mon, Apr 24 2017 7:11 PM

సుక్మా ఘటనపై రాజ్‌నాథ్‌ దిగ్ర్భాంతి

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై మావోయిస్టులు దాడి ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.  మావోయిస్టుల దాడిలో 24మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి బాధాకరమని, మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్‌ చేశారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌ హోంమంత్రితో రాజ్‌నాథ్‌ ఫోన్‌లో మాట్లాడారు. పరిస్థితిని దగ్గరుండి సమీక్షించాలని ఆదేశాలు ఇచ్చారు.

సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై దాడి పిరికిపందల చర్య అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, జవాన్ల త్యాగం వృథాగా పోనివ్వమని మోదీ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సంతాపం తెలిపారు.

Advertisement
Advertisement