ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణను.. అభియోగాలు నమోదైన ఏడాదిలోపే పూర్తి చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న ట్రయల్ కోర్టులు, కిందిస్థాయి కోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకోసం ఆ కేసుల్లో రోజువారీ విచారణను చేపట్టాలని సూచించింది. అత్యంత హేయమైన నేరాలతో సంబంధమున్న ప్రజాప్రతినిధులు.. విచారణలో జాప్యం కారణంగా పదవుల్లో కొనసాగుతున్నారని వ్యాఖ్యానించింది.
- పబ్లిక్ ఇంటరెస్ట్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ఒక పిటిషన్ను సోమవారం సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
- క్రూరమైన నేరాలతో సంబంధం ఉన్న కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు.. కోర్టుల్లో విచారణ సుదీర్ఘంగా సాగుతుండడంతో పదవుల్లో కొనసాగుతున్నారని ఆ సంస్థ తన పిటిషన్లో పేర్కొంది.
- అందువల్ల వారిపై విచారణను అతి శీఘ్రంగా పూర్తి చేసేలా కోర్టులకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.
- దీనిని పరిశీలించిన ధర్మాసనం... ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసుల్లో అభియోగాలు నమోదైన ఏడాదిలోపే విచారణ పూర్తి చేయాలని కింది కోర్టులకు ఆదేశించింది.
- ఇందుకోసం రోజువారీ విచారణ చేపట్టాలని సూచించింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 8(1), 8(2), 8(3) సెక్షన్ల కింద ఈ ఆదేశాలిస్తున్నట్లు పేర్కొంది.
- ఒకవేళ ఏడాదిలోపు విచారణ పూర్తి చేయలేకపోతే.. అందుకు తగిన కారణంపై తామున్న పరిధిలోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వివరణ ఇవ్వాలని సూచించింది.
- ఆ వివరణపై సంతృప్తి చెందితే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరికొంత కాలం గడువు ఇవ్వొచ్చని పేర్కొంది.
- అయితే విచారణ కోసం గడువును ఆరు నెలలుగా నిర్ణయించడానికి ధర్మాసనం తొలుత సిద్ధమైనా.. న్యాయ కమిషన్ సిఫార్సుల మేరకు ఏడాదిగా నిర్ణయించింది.
- ఐదేళ్ల కన్నా ఎక్కువ శిక్షపడే నేరాభియోగాలు నమోదైన ప్రజాప్రతినిధులను వెంటనే పదవుల నుంచి తొలగించాలన్న న్యాయ కమిషన్ సూచనను ప్రస్తుతం సాధారణ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పరిగణనలోకి తీసుకోలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఏడాదిలోగా విచారణ పూర్తి
Published Tue, Mar 11 2014 5:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement