తమిళనాడులో మళ్లీ భారీ వర్షాలు | Sakshi
Sakshi News home page

తమిళనాడులో మళ్లీ భారీ వర్షాలు

Published Sat, Nov 21 2015 7:54 PM

Heavy rains in Tamilnadu

చెన్నై :  శ్రీలంక సమీపాన బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడన ప్రభావం వల్ల తమిళనాడు, పుదుచ్చేరిల్లో మరో 24 గంటల్లో వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణశాఖ డెరైక్టర్ స్టెల్లా శనివారం ప్రకటించారు. ఈ అల్పపీడనం 48 గంటల్లో మరింతగా బలపడి సముద్రతీర జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులతో కూడిన వానలు కురుస్తాయని ఆమె తెలిపారు. కాగా, తమిళనాడులో ఇటీవలి కురిసిన వర్షాల కారణంగా మృతి చెందినవారి సంఖ్య శనివారానికి 230కి చేరింది. చెన్నైలోని వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పొన్ రాధాకృష్ణన్ శనివారం పర్యటించారు.

Advertisement
Advertisement