త్రుటిలో తప్పిన మరో రైలు ప్రమాదం | Sakshi
Sakshi News home page

త్రుటిలో తప్పిన మరో రైలు ప్రమాదం

Published Wed, Aug 30 2017 8:22 PM

Howrah-Dehradun Doon Express detaches from engine

జాన్‌పూర్‌(ఉత్తరప్రదేశ్‌): ఉత్తరప్రదేశ్‌లో డూన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. హౌరా నుంచి డెహ్రాడూన్‌కు వెళ్తుండగా ఖేటాసరాయి, జాన్‌పూర్‌ సెక‌్షన్ల మధ్య బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.

రైలింజన్‌ నుంచి బోగీలు విడివడటంతో డ్రైవర్‌ అప్రమత్తమై వెంటనే నిలిపివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. అధికారులకు సమాచారం అందించిన డ్రైవర్‌ గంట తర్వాత మరో ఇంజిన్‌ను రప్పించి బోగీలను తీసుకెళ్లారు.

Advertisement
Advertisement