సాక్షి, ముంబై: రైల్వే చార్జీలు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కూటమిలోని భాగస్వాముల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్డీయేలో భాగస్వామి అయిన శివసేన రైల్వే చార్జీల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. పేదల జేబులను కొల్లగొట్టే చార్జీల పెంపు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని శివసేన కార్యాధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం డిమాండ్ చేశారు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టడం ఎప్పుడూ జరిగేదే. అయితే ప్రతిపక్షాల ఆందోళనకు మద్దతు పలుకుతూ అధికారపక్ష వైఖరిని భాగస్వామ్య పార్టీ కూడా తప్పుబడుతుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఈ విషయమై ఉద్ధవ్ఠాక్రే మాట్లాడుతూ... పేదల ఆర్థిక బడ్జెట్ పూర్తిగా తలకిందులయ్యే విధంగా ఉందని, పెంపును వెంటనే రద్దుచేయాలని ఆయన కేంద్రానికి సూచించారు. ఢిల్లీలో శివసేనకు చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులు శివసేన వైఖరిని కేంద్రానికి తెలియజేస్తారని చెప్పారు. త్వరలో తాను స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీతో ఈ విషయంపై మాడ్లాడతానన్నారు. ‘ప్రస్తుతం పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు పేదలతోపాటు మధ్య తరగతి ప్రజలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. వచ్చే జీతం కంటే ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయి.
దీంతో కుటుంబాన్ని పోషించేం దుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి స్థితిలో రైలు చార్జీలు పెంచి వారిపై మరింత ఆర్థిక భారాన్ని మోపడం సబబు కాద’ని ఉద్ధవ్ అభిప్రాయపడ్డారు. ముందు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని, ఆ తర్వాతే చార్జీల పెంపుపై ఆలోచించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 25 నుంచి ప్రయాణ చార్జీలతోపాటు, సరుకు రవాణ చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ప్రభావం ముంబైలోని లోకల్ రైళ్ల ప్రయాణించే 75 లక్షల మందిపై పడనుంది. చార్జీలు దాదాపు రెట్టింపు కానున్నాయి.
మోడీతో మాట్లాడతా!
Published Sun, Jun 22 2014 10:22 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement